నిన్న భోపాల్ లో జరిగిన పెద్ది సాంగ్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ క్రికెటర్ బుమ్రాని ఉద్దేశించి ఫుట్ బాల్ ప్లేయరని సంబోధించడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దారి తీసింది. బుమ్రాకు ఇంకోవిధంగా ఆ ఆటతో కనెక్షన్ ఉందని మెగా ఫ్యాన్స్ సమర్ధించే ప్రయత్నం చేసినప్పటికీ అదంతా వృథా ప్రయాసే. యాంటీ ఫ్యాన్స్ ఈ అవకాశాన్ని శుభ్రంగా వాడేసుకుని వీడియోలు గట్రా ఎడిటింగ్ చేసేసి ఎక్స్, ఇన్స్ టాలో పెట్టేసి లక్షలల్లో వ్యూస్ తెచ్చేసుకుంటున్నారు.
కానీ ఇక్కడ ప్రాథమికంగా గుర్తించాల్సిన విషయం ఒకటుంది. భోపాల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అక్కడ హైలైట్ అయినవి ఎన్నో ఉన్నాయి. రెహమాన్ కన్సర్ట్, రవి కిషన్ స్పీచ్, దివ్యెందు ట్విస్ట్, జాన్వీ ప్రసంగం, వేళల్లో జన సందోహం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. ఇంత హడావిడిలో చరణ్ టంగ్ స్లిప్ అయిపోయి ఫుట్ బాల్ దగ్గర దొరికేసాడు. అంత మాత్రాన దాన్నే పదే పదే పట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
ఇటు మెగాభిమానులు కూడా ట్రోల్స్ కి సమాధానం చెప్పడం వల్ల వాటికి మరింత రీచ్ తెచ్చినట్టు అవుతుంది తప్పించి పాజిటివ్ అంశాలు బయటికి వెళ్లకుండా ఆగిపోతాయి. అసలే ట్రైలర్ తర్వాత పెద్ది మీద ఉన్న అంచనాలు తూకం తప్పాయి. వాటిని రిపేర్ చేయడానికి భోపాల్ వేడుకే మంచి అవకాశం. హైదరాబాద్ లో ఇంకో ఈవెంట్ చేసినా భోపాల్ అంత పెద్ద స్థాయిలో ఉంటుందో లేదో చెప్పలేం కాబట్టి చేతిలో ఉన్నది వాడుకోవడం ఉత్తమ నిర్ణయం.
బుమ్రాకు సారీ చెబుతూ రామ్ చరణ్ ట్వీట్ వేయడంతో అక్కడితో దానికి ముగింపు దక్కిందని చెప్పాలి. ఇది కాకుండా భోపాల్ ని పొరపాటున బీహార్ అని సంబోధించిన చరణ్ దాన్ని తర్వాత సరిచేసుకోవడం, జాన్వీ కపూర్ పక్కన కూచుని పొరపాటు గురించి చెప్పడం ఇవన్నీ వీడియోల రూపంలో బయటికి వచ్చాయి. ఇంకో పది రోజుల్లో విడుదల కాబోతున్న పెద్ది కోసం మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ సినిమాల కరువు అలా ఉంది మరి.
This post was last modified on May 24, 2026 11:51 am
కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…
పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…
నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్రజలు మేకిన్…
పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతులు గత కొన్ని రోజులుగా ఏనుగుల బెడదను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…