తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వ్యక్తిగత జీవితం గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించిన కొత్తలోనే ఒక నటి, సింగర్తో తన ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది. తర్వాత కీర్తి సురేష్తో తన పెళ్లి అంటూ ఒక దశలో చర్చ జరిగింది. ఇది ఫేక్ న్యూస్ అని తర్వాత వెల్లడైంది. ఐతే ఏడాదిగా అతడి పెళ్లి గురించి కొత్త వార్తలు వస్తున్నాయి.
సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్తో అనిరుధ్ ప్రేమలో ఉన్నట్లు.. వీరి పెళ్లి జరగబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాదే వీరి వివాహం గురించి వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ ప్రచారం ఊపందుకుంది. అనిరుధ్, కావ్యల వివాహానికి ముహూర్తం ఖరారైందని.. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగబోతోందని మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లత సోదరుడైన రవిచందర్ తనయుడే అనిరుధ్. ఇటు రవిచందర్, అటు రజినీకాంత్ కుటుంబాలతో మారన్ ఫ్యామిలీ పెళ్లి విషయంలో ఒక అవగాహనకు వచ్చిందని.. కుటుంబ సభ్యులు, ముఖ్యమైన బంధువులు, సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని.. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్గా రిసెప్షన్ పెట్టాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయని మీడియా రిపోర్ట్ చేస్తోంది.
సన్ గ్రూప్కు పలు వ్యాపారాలుండగా కావ్య.. ఐపీఎల్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ వ్యవహారాలను తనే చేసుకుంటోంది. 18 ఏళ్ల వయసులోనే ‘3’ మూవీతో సంగీత దర్శకుడిగా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్.. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతను ప్రస్తుతం డబుల్ డిజిట్ ఫిగర్ను పారితోషకంగా తీసుకుంటున్నాడు. ఈ ఏడాది ప్యారడైజ్, జైలర్-2 లాంటి సెన్సేషనల్ మూవీస్ అతడి నుంచి రాబోతున్నాయి.
This post was last modified on May 24, 2026 6:07 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…