ఇక సందేహాలేమీ లేనట్లే. బాలీవుడ్ హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి చేసుకోబోతున్నట్లే. దాదాపు రెండేళ్ల నుంచి కలిసి తిరుగుతున్నప్పటికీ.. తమ ప్రేమ గురించి ఇప్పటిదాకా ఈ జంట ఓపెన్గా ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ ఇటీవల ఓ వీడియో ఇంటర్వ్యూలో రణబీర్.. ఆలియాతో ప్రేమలో ఉన్న సంగతి నిర్ధరించాడు. అంతే కాదు.. కరోనా-లాక్ డౌన్ లేకుంటే తామిద్దరం ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకునే వాళ్లమని కూడా అన్నాడు. అతడి మాటల్ని బట్టి చూస్తే 2021లో వీరి పెళ్లి ఖాయమే అనుకోవచ్చు.
కానీ అంతకంటే ముందు వీళ్లిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. రణబీర్, అతడి తల్లి నీతూ కపూర్, ఆలియా కలిసి ఎయిర్ పోర్టులో ఉన్న ఫొటో ఒకటి పెట్టి.. నిశ్చితార్థం కోసం వీళ్లంతా కలిసి జైపూర్కు చేరుకున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు వడ్డిస్తోంది.
జైపూర్లోని రాంథంబోర్ పార్క్లో రణబీర్, ఆలియా నిశ్చితార్థం జరగబోతోందని.. ప్రియాంక చోప్రా పెళ్లి జరిగిన చోటే వీరి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారని.. ఈ సెలబ్రేటెడ్ కపుల్ ఇలా గుట్టు చప్పుడు కాకుండా నిశ్చితార్థం ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని.. మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కానీ వాస్తవం ఏంటంటే.. కొత్త సంవత్సర వేడుకల కోసమే రణబీర్, ఆలియా, నీతూ తదితరులు జైపూర్కు వెళ్లారట. అంతకుమించి ఏమీ లేదట. నిశ్చితార్థం ఇప్పుడేమీ జరగట్లేదని.. కొత్త ఏడాదిలో అందరికీ చెప్పే ఘనంగా ఎంగేజ్మెంట్, పెళ్లి చేసుకోబోతున్నారని కపూర్ కుటుంబ వర్గాలు తెలిపాయి.
రిషి కపూర్ సోదరుడు, కరిష్మా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ స్వయంగా ఈ విషయమై స్పష్టత ఇచ్చాడు. రణబీర్-ఆలియాల ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్లయితే అక్కడ కచ్చితంగా తమ కుటుంబం కూడా ఉంటుందని.. తాము జైపూర్ వెళ్లట్లేదంటే నిశ్చితార్థం ఏమీ జరగట్లేదని అర్థం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ ఎంగేజ్మెంట్ వార్తలకు తెరపడింది. ప్రస్తుతం రణబీర్-ఆలియా కలిసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తున్నారు. ఆలియా దీంతో పాటే ‘ఆర్ఆర్ఆర్’లోనూ నటిస్తోంది. ఈ సినిమాలు రెండూ పూర్తయ్యాకే ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…