అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి కొత్త సినిమా ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్. అతను రణబీర్ కపూర్తో తన తర్వాతి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కెరీర్లో ఇంత త్వరగా సందీప్ అంత పెద్ద బాలీవుడ్ స్టార్తో సినిమా చేస్తానని ఊహించి ఉండడు. పెద్దగా ఇమేజ్ లేని విజయ్ దేవరకొండ అనే కుర్రాడిని హీరోగా పెట్టి తక్కువ బడ్జెట్లో, ఎన్నో ఇబ్బందుల మధ్య అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్.. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో ఒక్కసారిగా హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్తో అక్కడా బాక్సాఫీస్ను షేక్ చేశాడు. తర్వాతి సినిమా ఖరారవడంలో ఆలస్యం జరిగినా.. ఎట్టకేలకు అది ఓకే అయింది.
సందీప్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇటీవలే ఓ వీడియో ఇంటర్వ్యూలో రణబీర్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్న టీ సిరీస్ అధికారిక అప్ డేట్ ద్వారా ఈ సినిమాను వార్తల్లోకి తీసుకురాబోతోంది. డిసెంబరు 31న అర్ధరాత్రి సందీప్-రణబీర్ సినిమా సర్ప్రైజ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు మీడియా ద్వారా ప్రకటించారు. మరి ఆ అప్ డేట్ ఏ రూపంలో ఉంటుంది అని అంతా చర్చించుకుంటున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ లాంటిదేమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. అలాగే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రానికి అనిమల్ అనే టైటల్ ఖరారైనట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా మొదలవుతుందని రణబీర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on December 31, 2020 7:16 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…