అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి కొత్త సినిమా ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్. అతను రణబీర్ కపూర్తో తన తర్వాతి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కెరీర్లో ఇంత త్వరగా సందీప్ అంత పెద్ద బాలీవుడ్ స్టార్తో సినిమా చేస్తానని ఊహించి ఉండడు. పెద్దగా ఇమేజ్ లేని విజయ్ దేవరకొండ అనే కుర్రాడిని హీరోగా పెట్టి తక్కువ బడ్జెట్లో, ఎన్నో ఇబ్బందుల మధ్య అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్.. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో ఒక్కసారిగా హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్తో అక్కడా బాక్సాఫీస్ను షేక్ చేశాడు. తర్వాతి సినిమా ఖరారవడంలో ఆలస్యం జరిగినా.. ఎట్టకేలకు అది ఓకే అయింది.
సందీప్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇటీవలే ఓ వీడియో ఇంటర్వ్యూలో రణబీర్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్న టీ సిరీస్ అధికారిక అప్ డేట్ ద్వారా ఈ సినిమాను వార్తల్లోకి తీసుకురాబోతోంది. డిసెంబరు 31న అర్ధరాత్రి సందీప్-రణబీర్ సినిమా సర్ప్రైజ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు మీడియా ద్వారా ప్రకటించారు. మరి ఆ అప్ డేట్ ఏ రూపంలో ఉంటుంది అని అంతా చర్చించుకుంటున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ లాంటిదేమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. అలాగే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రానికి అనిమల్ అనే టైటల్ ఖరారైనట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా మొదలవుతుందని రణబీర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…