అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి కొత్త సినిమా ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్. అతను రణబీర్ కపూర్తో తన తర్వాతి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కెరీర్లో ఇంత త్వరగా సందీప్ అంత పెద్ద బాలీవుడ్ స్టార్తో సినిమా చేస్తానని ఊహించి ఉండడు. పెద్దగా ఇమేజ్ లేని విజయ్ దేవరకొండ అనే కుర్రాడిని హీరోగా పెట్టి తక్కువ బడ్జెట్లో, ఎన్నో ఇబ్బందుల మధ్య అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్.. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో ఒక్కసారిగా హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్తో అక్కడా బాక్సాఫీస్ను షేక్ చేశాడు. తర్వాతి సినిమా ఖరారవడంలో ఆలస్యం జరిగినా.. ఎట్టకేలకు అది ఓకే అయింది.
సందీప్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇటీవలే ఓ వీడియో ఇంటర్వ్యూలో రణబీర్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్న టీ సిరీస్ అధికారిక అప్ డేట్ ద్వారా ఈ సినిమాను వార్తల్లోకి తీసుకురాబోతోంది. డిసెంబరు 31న అర్ధరాత్రి సందీప్-రణబీర్ సినిమా సర్ప్రైజ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు మీడియా ద్వారా ప్రకటించారు. మరి ఆ అప్ డేట్ ఏ రూపంలో ఉంటుంది అని అంతా చర్చించుకుంటున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ లాంటిదేమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. అలాగే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రానికి అనిమల్ అనే టైటల్ ఖరారైనట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా మొదలవుతుందని రణబీర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.
This post was last modified on December 31, 2020 7:16 am
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…