అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి కొత్త సినిమా ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్. అతను రణబీర్ కపూర్తో తన తర్వాతి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కెరీర్లో ఇంత త్వరగా సందీప్ అంత పెద్ద బాలీవుడ్ స్టార్తో సినిమా చేస్తానని ఊహించి ఉండడు. పెద్దగా ఇమేజ్ లేని విజయ్ దేవరకొండ అనే కుర్రాడిని హీరోగా పెట్టి తక్కువ బడ్జెట్లో, ఎన్నో ఇబ్బందుల మధ్య అర్జున్ రెడ్డి సినిమా తీసిన సందీప్.. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో ఒక్కసారిగా హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్తో అక్కడా బాక్సాఫీస్ను షేక్ చేశాడు. తర్వాతి సినిమా ఖరారవడంలో ఆలస్యం జరిగినా.. ఎట్టకేలకు అది ఓకే అయింది.
సందీప్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇటీవలే ఓ వీడియో ఇంటర్వ్యూలో రణబీర్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్న టీ సిరీస్ అధికారిక అప్ డేట్ ద్వారా ఈ సినిమాను వార్తల్లోకి తీసుకురాబోతోంది. డిసెంబరు 31న అర్ధరాత్రి సందీప్-రణబీర్ సినిమా సర్ప్రైజ్ అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు మీడియా ద్వారా ప్రకటించారు. మరి ఆ అప్ డేట్ ఏ రూపంలో ఉంటుంది అని అంతా చర్చించుకుంటున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ లాంటిదేమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. అలాగే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల గురించి వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రానికి అనిమల్ అనే టైటల్ ఖరారైనట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా మొదలవుతుందని రణబీర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…