తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా ఈ సినిమా తీసి గొప్ప పేరు సంపాదించారు. ఈ చిత్రానికి దర్శకుడు ప్రభుదేవా అయినప్పటికీ.. రైటింగ్, మేకింగ్లో రాజు ఎంతో ఇన్వాల్వ్ అయ్యారన్న సంగతి తెలిసిందే. నువ్వొస్తానంటే నేనొద్దంటానాకు ఆయన స్క్రీన్ ప్లే కూడా అందించారు.
ఈ చిత్రంలో ఎన్నో అద్భుత సన్నివేశాలు ఉంటాయి. గల్ గల్ అంటూ సాగే పాట మధ్యలో ఒక మేక.. తన మేకపిల్లకు జన్మనిచ్చే సన్నివేశంలో హీరో హీరోయిన్ల స్పందనను కథలోని సందర్భానికి తగ్గట్లు ఎంతో హృద్యంగా తీశారు. ఐతే ఈ ఐడియా పూర్తిగా ఎం.ఎస్.రాజుదేనట. స్క్రిప్టులో లేని విషయాన్ని అప్పటికప్పుడు మెరుపు లాంటి ఆలోచనతో ఎలా తీశామో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎం.ఎస్.రాజు వెల్లడించారు.
నిజానికి అప్పుడు పాట చిత్రీకరణ ఏమీ జరగట్లేదట. ప్రకాష్ రాజ్ గొడ్డు కారం అన్నం తినే సన్నివేశాన్ని తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. దర్శకుడు ప్రభుదేవా ఆ సన్నివేశాన్ని ప్రకాష్ రాజ్కు వివరిస్తున్న సమయంలో మేకల దొడ్డిలో ఒక మేక ఇబ్బంది పడుతుండడాన్ని ఎం.ఎస్.రాజు గమనించారట. అది ప్రసవించబోతోందని తనకు అర్థమై, వెంటనే దాన్ని క్యాప్చర్ చేసి సినిమా కోసం వాడుకోవాలని ఆలోచించారట రాజు.
వెంటనే సినిమాటోగ్రాఫర్ వేణుతో పాటు దర్శకుడు ప్రభుదేవాను గట్టిగా కేకేసి పిలిచారట రాజు. ప్రకాష్ రాజ్ కూడా ఏంటి హడావుడి అంటూ అక్కడికి వచ్చారని.. తాను వెంటనే సినిమాటోగ్రాఫర్కు ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేయమని చెప్పానని రాజు తెలిపారు. హీరో సిద్దార్థ్ను కూడా పిలిచి ప్రసవించిన మేకపిల్లను చేతిలోకి తీసుకుని అబ్బుర పడే ఎక్స్ప్రెషన్ ఇవ్వమని చెప్పానన్నారు.
అప్పటికి త్రిష సెట్లో లేదని.. తర్వాతి రోజు ఆమె వచ్చాక సిద్ధుతో కలిసి మేక ప్రసవిస్తున్న దృశ్యం చూస్తున్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వమని చెప్పినట్లు రాజు తెలిపారు. ఐతే ఆ సన్నివేశ నేపథ్యం అర్ధం కాక ముందు తీసిన రషెస్ చూపించమని అడిగిందని, అది తెప్పించి చూపించాక, అద్భుతమైన ఎక్స్ప్రెషన్తో ఆ షాట్ పూర్తి చేసిందని రాజు వెల్లడించారు. అలా గల్ గల్ పాటలో వచ్చే ఆ హృద్యమైన షాట్ క్రెడిట్ తనదే అని చెప్పుకొచ్చారు రాజు. ఈ దిగ్గజ నిర్మాత దర్శకుడిగా రూపొందించిన అగధ త్వరలో విడుదల కాబోతోంది.
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…