పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు. చెన్నైలో ఉన్నారని ఒకరు, హైదరాబాద్ లో ఉండి పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ పనులు చూసుకుంటున్నారని మరొకరి ఇలా రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నారు. ముంబైలో పద్దెనిమిదో తేదీ ట్రైలర్ లాంచ్ జరగనుంది. భోపాల్ లో ఐటెం సాంగ్ విడుదల చేస్తారు. ఇందులోనే రెహమాన్ లైవ్ కన్సర్ట్ ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
నిజానికి రెహమాన్ ఈ పద్ధతికి వ్యతిరేకం కాదు. గతంలో ఎన్నో తమిళ సినిమాలకు స్టేజి మీద లైవ్ ఇచ్చారు. ధనుష్ రాయన్ కోసం ఇచ్చిన పెర్ఫార్మన్స్ వీడియోల రూపంలో చాలా వైరల్ అయ్యింది. ఆయన ప్రత్యక్షంగా మ్యూజిక్ చేస్తూ పాటలు పాడితే ఆ వైబ్ వేరేలా ఉంటుంది. అయితే రెహమాన్ కు అంత టైం ఉందానేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. లైవ్ అంటే ముందస్తుగా ప్రిపరేషన్లు చేసుకోవాలి. రిహార్సల్స్ అవసరం. చూస్తేనేమో పెద్ది రిలీజ్ కు ఇరవై రోజులే ఉంది.
ఇప్పుడు రెహమాన్ ప్రోగామ్ గురించి ఎక్కువ ప్రచారం చేసి తీరా ఏదైనా కారణాల వల్ల భోపాల్ లో అది నిర్వహించలేకపోతే నెగటివ్ అవుతుంది. కానీ ఆ సమస్య లేదు. బుచ్చిబాబు ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉంటుందని స్పష్టంగా చెప్పేశారు కాబట్టి సందేహాలు అక్కర్లేదు. లైవ్ కన్సర్ట్ అంటే హ్యాపీనే. అందరూ ఎంజాయ్ చేస్తారు. జాతీయ స్థాయిలో కవరేజ్ వస్తుంది. మైలేజ్ కూడా పెరుగుతుంది. అభిమానులు కోరుకుంటున్నది ఇలాంటి మైలేజ్ ఇచ్చే ప్రమోషన్లే.
పెద్ది టీమ్ కాళ్ళకు విమానాలు కట్టుకుని పరుగులు పెడుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పబ్లిసిటీ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నా బెస్ట్ అవుట్ ఫుట్ కి పబ్లిసిటీ అవసరం లేదనే ధోరణి మేకర్స్ లో కనిపిస్తోంది. అలాని పెద్దిని లైట్ తీసుకోవడం లేదు. ట్రైలర్ లాంచ్ అయ్యాక నాన్ స్టాప్ గా రెండు వారాల పాటు ప్రచారం హోరెత్తిపోయేలా పలు కార్యక్రమాలు ప్లాన్ చేశారట. పిఠాపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్రతిపాదన ఉందట కానీ సాధ్యం కాకపోవచ్చని టాక్.
This post was last modified on May 12, 2026 10:50 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…