Movie News

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది. ఈ సందర్భంగా ఎన్నో అంశాలు తెరమీదకు వచ్చాయి. అద్దెల విధానం వల్ల తాము ఎంత నష్టపోతున్నామో వివరించిన విధానం అందరినీ షాక్ కు గురి చేసింది. మన శంకరవరప్రసాద్ గారుకి ఒక సింగల్ స్క్రీన్లో 50 లక్షలు నెట్ వస్తే, అందులో 5 లక్షలు థియేటర్ ఓనర్ కి, 45 లక్షలు ప్రొడ్యూసర్ కు వెళ్ళిపోయిన ఉదాహరణ ఆలోచింపజేసేలా ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇకపై జీవో తెచ్చుకున్నా సరే సింగల్ స్క్రీన్లలో ఇప్పుడు ఉన్న ధరలే ఉంటాయని చెప్పడం అందరికి షాక్ కలిగించింది. ఎందుకంటే అమలులో చాలా సమస్యలు వస్తాయి. అలాని ఉపయోగాలు లేవని కాదు, అంతకన్నా ఎక్కువే ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం పెంచుకోండి అని అనుమతి ఇచ్చినా ఆ అవకాశాన్ని వాడుకోకపోవడం ప్రేక్షకుల కోణంలో చాలా గొప్ప నిర్ణయం అవుతుంది. స్టార్ హీరోల అభిమానులు పండగ చేసుకున్నట్టే.

వచ్చే నెల జూన్ 4 పెద్ది రానుంది. మరి ఆ టైంకంతా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఒకే తాటి మీదకు వస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే కేవలం మల్టీప్లెక్సుల్లో ఎంజాయ్ చేసే సినిమా కాదది. సింగల్ స్క్రీన్లలో సంబరాలు చేసేందుకు మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అటుపై వరసగా ప్యారడైజ్, విశ్వంభర, స్వయంభు, సంబరాల ఏటిగట్టు లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ వస్తాయి. ఇవన్నీ హైక్స్ కోరుకునే భారీ బడ్జెట్ సినిమాలు.

నైజాం పరిణామాలను ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు నిశితంగా గమనిస్తున్నారు. ఇదే డిమాండ్ తో త్వరలోనే వీళ్ళు సమావేశం కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి ఒకే డిమాండ్ వినిపించబోతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో మూతబడిన సింగల్ స్క్రీన్ల సంఖ్య మరింత పెరగకుండా ఉండటం కోసమే తామీ చర్యలకు పూనుకున్నట్టు థియేటర్ ఓనర్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి.

This post was last modified on May 12, 2026 7:53 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

8 hours ago