తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది. ఈ సందర్భంగా ఎన్నో అంశాలు తెరమీదకు వచ్చాయి. అద్దెల విధానం వల్ల తాము ఎంత నష్టపోతున్నామో వివరించిన విధానం అందరినీ షాక్ కు గురి చేసింది. మన శంకరవరప్రసాద్ గారుకి ఒక సింగల్ స్క్రీన్లో 50 లక్షలు నెట్ వస్తే, అందులో 5 లక్షలు థియేటర్ ఓనర్ కి, 45 లక్షలు ప్రొడ్యూసర్ కు వెళ్ళిపోయిన ఉదాహరణ ఆలోచింపజేసేలా ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇకపై జీవో తెచ్చుకున్నా సరే సింగల్ స్క్రీన్లలో ఇప్పుడు ఉన్న ధరలే ఉంటాయని చెప్పడం అందరికి షాక్ కలిగించింది. ఎందుకంటే అమలులో చాలా సమస్యలు వస్తాయి. అలాని ఉపయోగాలు లేవని కాదు, అంతకన్నా ఎక్కువే ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం పెంచుకోండి అని అనుమతి ఇచ్చినా ఆ అవకాశాన్ని వాడుకోకపోవడం ప్రేక్షకుల కోణంలో చాలా గొప్ప నిర్ణయం అవుతుంది. స్టార్ హీరోల అభిమానులు పండగ చేసుకున్నట్టే.
వచ్చే నెల జూన్ 4 పెద్ది రానుంది. మరి ఆ టైంకంతా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఒకే తాటి మీదకు వస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే కేవలం మల్టీప్లెక్సుల్లో ఎంజాయ్ చేసే సినిమా కాదది. సింగల్ స్క్రీన్లలో సంబరాలు చేసేందుకు మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అటుపై వరసగా ప్యారడైజ్, విశ్వంభర, స్వయంభు, సంబరాల ఏటిగట్టు లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ వస్తాయి. ఇవన్నీ హైక్స్ కోరుకునే భారీ బడ్జెట్ సినిమాలు.
నైజాం పరిణామాలను ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు నిశితంగా గమనిస్తున్నారు. ఇదే డిమాండ్ తో త్వరలోనే వీళ్ళు సమావేశం కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి ఒకే డిమాండ్ వినిపించబోతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో మూతబడిన సింగల్ స్క్రీన్ల సంఖ్య మరింత పెరగకుండా ఉండటం కోసమే తామీ చర్యలకు పూనుకున్నట్టు థియేటర్ ఓనర్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…