ఈ నెల (మే) మొదటి రోజున హైదరాబాద్ కు చెందిన కుటుంబం.. సిరిసిల్లకు చెందిన మరో ఫ్యామిలీ కలిసి యాదాద్రి.. గోల్డెన్ టెంపుల్ ను సందర్శించుకొని.. తిరుగు ప్రయాణంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్లే క్రమంలో ఔటర్ మీద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అమిత వేగంతో ఢీ కొట్టటం.. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు దుర్మరణం పాలు కాగా.. ఒకరికి తీవ్ర గాయాలు కావటం తెలిసిందే. ఇంచుమించు ఇదే తరహాలో దారుణ విషాదం ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది.
ఈసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు.. కెమేరా మ్యాన్ ఇరువురు దుర్మరణం పాలయ్యారు. మే ఒకటిన జరిగిన ఘోర ప్రమాదంలో శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ పదహారు వద్ద జరిగితే.. తాజాగా జరిగిన ప్రమాదం పెద్ద అంబర్ పేట సమీపంలోని ఓఆర్ ఆర్ ఎగ్జిట్ 12 వద్ద చోటు చేసుకుంది. ఈ రెండు ఉదంతాల్లో కారు తమ ముందున్న వాహనాల్ని బలంగా ఢీ కొట్టటం.. రెండు సందర్భాల్లో మితిమీరిన వేగంతో దూసుకెళ్లటమే కనిపిస్తుంది.
తాజా విషాద ఉదంతంలో ఇరువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదిభట్ల పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అతి వేగమే తాజా విషాదానికి కారణంగా తేల్చారు. కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారును వెలికి తీసి.. అందులో ఇరుక్కుపోయిన బాడీలను వెలికి తీయటం కష్టమైంది.
చివరకు రెండు డెడ్ బాడీలకు పోస్టు మార్టం చేసేందుకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం నటుడు భరత్ కాంత్, కెమేరా మ్యాన్ గా పని చేసే సాయి త్రిలోక్ లు తమ సొంతూరైన నెల్లూరుకు వెళ్లి.. తిరిగి హైదరాబాద్ కు తిరిగి వస్తున్న వేళలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పదేళ్ల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న వీరిద్దరూ తాజాగా నానక్ రాం గూడలో ఉంటున్నారు.
2024లో విడుదలైన ‘‘టెనెంట్’’ మూవీలో రిషి పాత్రలో నటించాడు. ఇతడి స్నేహితుడైన సాయి త్రిలోక్ పలు ప్రాజెక్టుల్లో కెమేరా మ్యాన్ గా వ్యవహరించాడు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఈ ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి కారు ఎవరు నడుపుతున్నారు? ప్రమాదానికి కారణమేంటి? ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగమెంత? లాంటి వివరాలను తేల్చాల్సి ఉంది.
సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలు కావటంపై చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ప్రయాణాల్లో అజాగ్రత్త.. మితిమీరిన వేగం.. నిద్రమత్తు ప్రాణాల్ని తీయటమే కాదు.. తమ గురించి కోటి ఆశల్ని పెట్టుకున్న కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తారన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…