Movie News

ORRపై మరో విషాదం.. నటుడు.. కెమేరా మ్యాన్ బలి

ఈ నెల (మే) మొదటి రోజున హైదరాబాద్ కు చెందిన కుటుంబం.. సిరిసిల్లకు చెందిన మరో ఫ్యామిలీ కలిసి యాదాద్రి.. గోల్డెన్ టెంపుల్ ను సందర్శించుకొని.. తిరుగు ప్రయాణంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్లే క్రమంలో ఔటర్ మీద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అమిత వేగంతో ఢీ కొట్టటం.. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు దుర్మరణం పాలు కాగా.. ఒకరికి తీవ్ర గాయాలు కావటం తెలిసిందే. ఇంచుమించు ఇదే తరహాలో దారుణ విషాదం ఈ తెల్లవారుజామున చోటు చేసుకుంది.

ఈసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు.. కెమేరా మ్యాన్ ఇరువురు దుర్మరణం పాలయ్యారు. మే ఒకటిన జరిగిన ఘోర ప్రమాదంలో శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ పదహారు వద్ద జరిగితే.. తాజాగా జరిగిన ప్రమాదం పెద్ద అంబర్ పేట సమీపంలోని ఓఆర్ ఆర్ ఎగ్జిట్ 12 వద్ద చోటు చేసుకుంది. ఈ రెండు ఉదంతాల్లో కారు తమ ముందున్న వాహనాల్ని బలంగా ఢీ కొట్టటం.. రెండు సందర్భాల్లో మితిమీరిన వేగంతో దూసుకెళ్లటమే కనిపిస్తుంది.

తాజా విషాద ఉదంతంలో ఇరువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదిభట్ల పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అతి వేగమే తాజా విషాదానికి కారణంగా తేల్చారు. కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారును వెలికి తీసి.. అందులో ఇరుక్కుపోయిన బాడీలను వెలికి తీయటం కష్టమైంది.

చివరకు రెండు డెడ్ బాడీలకు పోస్టు మార్టం చేసేందుకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం నటుడు భరత్ కాంత్, కెమేరా మ్యాన్ గా పని చేసే సాయి త్రిలోక్ లు తమ సొంతూరైన నెల్లూరుకు వెళ్లి.. తిరిగి హైదరాబాద్ కు తిరిగి వస్తున్న వేళలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పదేళ్ల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న వీరిద్దరూ తాజాగా నానక్ రాం గూడలో ఉంటున్నారు.

2024లో విడుదలైన ‘‘టెనెంట్’’ మూవీలో రిషి పాత్రలో నటించాడు. ఇతడి స్నేహితుడైన సాయి త్రిలోక్ పలు ప్రాజెక్టుల్లో కెమేరా మ్యాన్ గా వ్యవహరించాడు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఈ ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి కారు ఎవరు నడుపుతున్నారు? ప్రమాదానికి కారణమేంటి? ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగమెంత? లాంటి వివరాలను తేల్చాల్సి ఉంది.

సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలు కావటంపై చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ప్రయాణాల్లో అజాగ్రత్త.. మితిమీరిన వేగం.. నిద్రమత్తు ప్రాణాల్ని తీయటమే కాదు.. తమ గురించి కోటి ఆశల్ని పెట్టుకున్న కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తారన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.

Kumar

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago