తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్ గురించి డిస్కషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవికి దక్కింది పద్దెనిమిది సీట్లే అయినా రెండు దిగ్గజ పార్టీలను ఎదురుకుని ఆ మాత్రం సాధించడం గొప్ప విషయమని అప్పట్లో పత్రికలు రాశాయి. కానీ కొంత కాలానికే పార్టీని ఆపేయడం, కాంగ్రెస్ లో కలిపేయడం నష్టాన్ని చేకూర్చాయి.
ఒకవేళ చిరంజీవి కనక ఇంకొక టర్మ్ ఆగి ఉంటే ఇప్పుడు జనసేన రేపిన ప్రభంజనానికి రెట్టింపు చూసి ఉండేదన్న విశ్లేషణని కొట్టి పారేయలేం. పవన్ కళ్యాణ్ ఆ లోటుని తీరుస్తున్నప్పటికీ కూటమిలో భాగంగా ఉన్నారు తప్పించి సోలో పార్టీగా కాదు. ఇక రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా వెళ్లిపోయారు. అనారోగ్యం, దూకుడుగా ఉండలేని మనస్తత్వం లాంటి ఎన్నో కారణాలు వెనుకడుగు వేసేలా చేశాయి. ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.
లోక నాయకుడు కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టాక దాన్ని బలపరిచే దిశగా ఎలాంటి అడుగులు వేయలేదు. చివరికి డీఎంకే, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి వెనుక ఉండిపోయారు. చిరు, రజని, కమల్ ముగ్గురిలో ఒక సారూప్యత ఉంది. వీళ్లకు నటతృష్ణ ఎక్కువ. సినిమాలు చేయకుండా ఉండలేరు. స్క్రీన్ మీద కనిపించకూడదని ఏనాడూ కోరుకోలేదు. అందుకే ఖైదీ నెంబర్ 150, రోబో, విక్రమ్ లాంటి కంబ్యాక్ మూవీస్ తో ముగ్గురూ లెగసీ, సీనియారిటీని నిలబెట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్, విజయ్ అలా కాదు. సినిమాలు పూర్తిగా వద్దనుకున్నారు. పార్టీ ఫండింగ్ కోసం పవన్ అనన్యమనస్కంగా ఒప్పుకోవడం వల్లే ఆయన స్థాయి కంటెంట్లు దర్శకులు ఇవ్వలేకపోతున్నారు. ఇక విజయ్ జన నాయకుడు తర్వాత మేకప్ వేసుకునే సమస్యే లేదు. పైన చెప్పిన ముగ్గురు దిగ్గజాలు నూటా యాభై, రెండు వందల సినిమాలకు పైగా నటించి యాక్టింగ్ ని ఊపిరిగా మార్చుకున్న వాళ్ళు. అందుకే స్క్రీన్ మీద నెగ్గినా పొలిటికల్ స్క్రీన్ మీద నిలబడలేక తిరిగి సెట్స్ కు వచ్చేశారు.
This post was last modified on May 5, 2026 7:50 pm
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
టాలీవుడ్లో అత్యంత నిరాశాజనకంగా సాగిన వేసవి సీజన్లలో 2025 ఒకటి. ఆ సంవత్సరం ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా…
టాలీవుడ్లో హీరోగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ టైంలోనే పెద్ద రేంజికి చేరుకుని.. ఆ తర్వాత సుదీర్ఘమైన ఫ్లాప్…
టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తలపెట్టి రామాయల నిర్మాణానికి సంబంధించిన ఇక్కట్లు దాదాపు తొలిగిపోయాయి. ఆయన సొంత…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అసామాన్యులు విజయం దక్కించుకోవడం.. వారసులు గెలుపు గుర్రాలు ఎక్కడం.. వరుస విజయాలు దక్కించుకున్న హేమాహేమీలు…
చైనాలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా ఈస్టర్న్…