ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్ లాంటి చాలా కొద్ది మంది మాత్రమే 80 ఏళ్లు పైబడ్డా సినిమాలు తీస్తుంటారు. ఐతే ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఎవరికీ సాధ్యం కాని విధంగా మన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. ఏకంగా 94 ఏళ్ల వయసులో సినిమా తీసి ఔరా అనిపించారు.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగ్ గీతం’ సినిమా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వయసులోనూ ఎంతో ఓపికతో కేవలం 4 నెలల్లోనే సినిమా తీసి ఔరా అనిపించారు సింగీతం. పాత తరం దర్శకుడు కదా.. కంటెంట్ అందుకు తగ్గట్లే ఉంటుందేమో అనుకుంటే.. కంటెంపరరీ కథతో ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగే సినిమా తీశారని టీజర్ చూస్తే అర్థమైంది.
‘సింగ్ గీతం’ చిత్రంతో సింగీతం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న దర్శకుల్లో సినిమా తీసిన అతి పెద్ద వయస్కుడు సింగీతమే. ఇప్పటిదాకా ఆ రికార్డు హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్లింట్ ఈస్ట్వుడ్ పేరిట ఉంది. ఆయన 2024లో ‘జొరోర్ 2’ సినిమా తీశారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఈస్ట్వుడే. ఆ సినిమా తీసే సమయానికి ఆయన వయసు 93 ఏళ్లు.
సింగీతం ఆయన కంటే ఒక సంవత్సరం పెద్ద వయసులో ‘సింగ్ గీతం’ తీశారు. ఐతే మొత్తంగా అత్యంత పెద్ద వయసులో ఫీచర్ ఫిలిం తీసిన ఘనత పోర్చుగీస్ దర్శకుడు మానువల్ డి ఎలోవీరా పేరిట ఉంది. ఆయన 103 ఏళ్ల వయసులో ‘జెబో అండ్ ద షాడో’ అనే సినిమా తీశారు. ఈ సినిమా 2012లో వచ్చింది. ఎలోవీరా ఇంకో మూడేళ్ల తర్వాత 106 ఏళ్ల వయసులో మరణించారు.
ఇప్పుడు జీవించి ఉన్న దర్శకుల్లో అత్యంత పెద్ద వయసులో సినిమా తీసిన ఘనత మాత్రం సింగీతం సొంతం చేసుకున్నారు. మరి ఈ ఉత్సాహంలో సింగీతం ‘సింగ్ గీతం’ తర్వాత కూడా సినిమా తీసి, తన రికార్డును తానే బద్దలు కొడతారేమో చూడాలి.
This post was last modified on May 3, 2026 11:16 pm
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…