Movie News

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్ లాంటి చాలా కొద్ది మంది మాత్రమే 80 ఏళ్లు పైబడ్డా సినిమాలు తీస్తుంటారు. ఐతే ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఎవరికీ సాధ్యం కాని విధంగా మన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. ఏకంగా 94 ఏళ్ల వయసులో సినిమా తీసి ఔరా అనిపించారు.

ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగ్ గీతం’ సినిమా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వయసులోనూ ఎంతో ఓపికతో కేవలం 4 నెలల్లోనే సినిమా తీసి ఔరా అనిపించారు సింగీతం. పాత తరం దర్శకుడు కదా.. కంటెంట్ అందుకు తగ్గట్లే ఉంటుందేమో అనుకుంటే.. కంటెంపరరీ కథతో ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగే సినిమా తీశారని టీజర్ చూస్తే అర్థమైంది.

‘సింగ్ గీతం’ చిత్రంతో సింగీతం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న దర్శకుల్లో సినిమా తీసిన అతి పెద్ద వయస్కుడు సింగీతమే. ఇప్పటిదాకా ఆ రికార్డు హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్లింట్ ఈస్ట్‌‌వుడ్ పేరిట ఉంది. ఆయన 2024లో ‘జొరోర్ 2’ సినిమా తీశారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఈస్ట్‌వుడే. ఆ సినిమా తీసే సమయానికి ఆయన వయసు 93 ఏళ్లు.

సింగీతం ఆయన కంటే ఒక సంవత్సరం పెద్ద వయసులో ‘సింగ్ గీతం’ తీశారు. ఐతే మొత్తంగా అత్యంత పెద్ద వయసులో ఫీచర్ ఫిలిం తీసిన ఘనత పోర్చుగీస్ దర్శకుడు మానువల్ డి ఎలోవీరా పేరిట ఉంది. ఆయన 103 ఏళ్ల వయసులో ‘జెబో అండ్ ద షాడో’ అనే సినిమా తీశారు. ఈ సినిమా 2012లో వచ్చింది. ఎలోవీరా ఇంకో మూడేళ్ల తర్వాత 106 ఏళ్ల వయసులో మరణించారు.

ఇప్పుడు జీవించి ఉన్న దర్శకుల్లో అత్యంత పెద్ద వయసులో సినిమా తీసిన ఘనత మాత్రం సింగీతం సొంతం చేసుకున్నారు. మరి ఈ ఉత్సాహంలో సింగీతం ‘సింగ్ గీతం’ తర్వాత కూడా సినిమా తీసి, తన రికార్డును తానే బద్దలు కొడతారేమో చూడాలి.

This post was last modified on May 3, 2026 11:16 pm

Share

Recent Posts

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

14 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

1 hour ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

1 hour ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

4 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

5 hours ago