‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే అవకాశం అంటే అంతకంటే ఓ దర్శకుడికి అదృష్టం ఏముంటుంది? ఐతే ప్రభాస్తో సినిమా చేయడానికి పెద్ద పెద్ద దర్శకులు ఆసక్తితో ఉన్నప్పటికీ.. రెబల్ స్టార్ మాత్రం ఒకట్రెండు సినిమాల అనుభవమున్న డైరెక్టర్లతోనే పని చేశాడు. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన మూడు చిత్రాలకు పని చేసిన యంగ్ డైరెక్టర్లు ఎవ్వరూ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు.
సుజీత్ తీసిన ‘సాహో’, రాధాకృష్ణకుమార్ చేసిన ‘రాధేశ్యామ్’, ఓం రౌత్ రూపొందించిన ‘ఆదిపురుష్’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఈ ముగ్గురు దర్శకుల కెరీర్లోనూ గ్యాప్ వచ్చింది. ఐతే సుజీత్ కొన్నేళ్ల తర్వాత అయినా పుంజుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం అందుకుని, ‘ఓజీ’తో మంచి ఫలితం రాబట్టాడు.
ఓం రౌత్ కొంచెం లేటుగా అయినా ధనుష్ హీరోగా అబ్దుల్ కలాం బయోపిక్ తీసేందుకు రెడీ అవుతున్నాడు. కానీ రాధాకృష్ణకుమార్ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ‘రాధేశ్యామ్’ రిలీజై నాలుగేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా రాధాకృష్ణ కొత్త చిత్రం గురించి ఏ సమాచారం లేదు.
మధ్యలో తన తొలి చిత్రం ‘జిల్’ కథానాయకుడు గోపీచంద్తో రాధాకృష్ణ ఇంకో సినిమా చేస్తాడని.. అతడి రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన యువి క్రియేషన్సే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్త నిజం కాలేదు. తర్వాత రాధాకృష్ణ గురించి మీడియా వాళ్లు కూడా ఏమీ పట్టించుకోలేదు.
యువి వాళ్లు ‘విశ్వంభర’లో తలమునకలయ్యారు. దాని బడ్జెట్ హద్దులు దాటిపోయి, రిలీజ్ బాగా ఆలస్యం అవుతుండడంతో వేరే ప్రాజెక్టుల మీద దృష్టిపెట్టే అవకాశం రావట్లేదు. మధ్యలో ‘కపుల్ ఫ్రెండ్లీ’ లాంటి చిన్న సినిమా తీశారంతే. ‘విశ్వంభర’ రిలీజై మంచి ఫలితాన్నందుకుంటే.. రాధాకృష్ణతో సినిమాను ముందుకు తీసుకెళ్లే అవకాశముంది.
మరి వేరే నిర్మాణ సంస్థల్లో అతను ఎక్కడా ప్రయత్నించట్లేదా.. తనతో సినిమా చేయడానికి ఇంకే హీరో ముందుకు రావట్లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మరి ‘రాధేశ్యామ్’ దెబ్బ నుంచి ఎప్పటికి కోలుకుని కొత్త సినిమాతో రాధాకృష్ణ ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.
This post was last modified on April 26, 2026 8:01 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…