ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి విజువల్ వండర్ చూశాక తన బ్యానర్ లోనూ అలాంటి క్లాసిక్ తీయాలనే సంకల్పంతో నిర్మాత ఎంఎస్ రాజు దేవికి శ్రీకారం చుట్టారు. తన సంస్థకు ఆస్థాన దర్శకుడు, అమ్మోరు సృష్టికర్త కోడి రామకృష్ణకే ఆ బాధ్యతలు అప్పజెప్పారు. టీనేజ్ లో అడుగు పెడుతున్న దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ మీద నమ్మకంతో ఇంత భారీ చిత్రానికి డెబ్యూ సంగీత దర్శకుడిగా అవకాశమిచ్చారు.
1999 మార్చ్ 12 విడుదలైన దేవి సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. అప్పటికే పాము బ్యాక్ డ్రాప్ లో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి కానీ గ్రాఫిక్స్ ప్రధానంగా వచ్చినవి తక్కువ. దీంతో ప్రేక్షకులు ఎగబడి చూశారు. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండేదంటే కేవలం పాము కాన్సెప్ట్ తో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేంత. కమర్షియల్ గా గొప్ప విజయం అందుకున్న దేవి అందరి కెరీర్లకు మేలిమలుపుగా నిలిచింది. టైటిల్ రోల్ పోషించిన కన్నడ నటి ప్రేమ ఫుల్ డిమాండ్ ఎంజాయ్ చేశారు.
కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత దేవికి కొనసాగింపు ప్లాన్ చేస్తున్నారు ఎంఎస్ రాజు. దేవి 2 వర్కింగ్ టైటిల్ గా పెట్టుకుని స్క్రిప్ట్ పూర్తి చేశారట. ఒక పాపులర్ హీరోయిన్ ని నటింపజేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. కథ ఓకే అయ్యిందని, బడ్జెట్ తదితర వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తున్నాయని వినికిడి. ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేసేలా ప్లానింగ్ ఉంటుందట. అనుష్క అయితే బాగుంటుంది కానీ ఎవరికి సెలక్ట్ చేస్తారో చూడాలి.
ఒకరకంగా దేవి 2 తీయడం రాజుగారికి సవాల్ లాంటిది. ఎందుకంటే కోడి రామకృష్ణ ఇప్పుడు లేరు. విజువల్ ఎఫెక్ట్స్ ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు చాలా మాములు విషయం అయిపోయింది. ప్రేక్షకులను మెప్పించాలంటే విఎఫ్ఎక్స్ గొప్పగా ఉండాలి. కేవలం టీజర్ లో అవి లేనందువల్లే విశ్వంభర మోక్షం దక్కించుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటోంది. అప్పటి దేవిలో నటించిన క్యాస్టింగ్ అందరూ దాదాపు అందుబాటులోనే ఉన్నారు. మరి రాజు గారి కొత్త దేవి ఎవరో వెయిట్ చేయాలి.
This post was last modified on April 26, 2026 1:34 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…