టాలీవుడ్లో ఒకప్పుడు రీమేక్లకు పెట్టింది పేరు సీనియర్ హీరో రాజశేఖర్. మొరటోడు నా మొగుడు, సూర్యుడు, బలరామ కృష్ణులు, సింహరాశి, విలన్, సత్యమేవ జయతే, గడ్డం గ్యాంగ్, శేఖర్.. ఇలా లెక్కలేనన్ని రీమేక్ సినిమాలు చేశారాయన. అందులో కొన్ని విజయవంతం అయ్యాయి. కొన్ని ఫెయిలయ్యాయి. ఐతే రాజశేఖర్ తాను మిస్సయిన ఓ రీమేక్ గురించి తరచుగా బాధ పడుతూ ఉంటారు. అదే.. ఠాగూర్.
తమిళంలో విజయ్ కాంత్ హీరోగా మురుగదాస్ రూపొందించిన రమణ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ముందు ఈ సినిమా రీమేక్ హక్కులను తీసుకుంది రాజశేఖరే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి చేతికి వెళ్లిపోయింది. మరి మధ్యలో ఏం జరిగిందన్నది సస్పెన్స్. ఇటీవలే బైకర్ మూవీలో ప్రత్యేక పాత్రలో పలకరించిన రాజశేఖర్.. ఒక ఇంటర్వ్యూలో ఠాగూర్ రీమేక్ విషయంలో తెర వెనుక ఏం జరిగిందో వెల్లడించారు.
రమణ రీమేక్ హక్కులను ముందు కొనుగోలు చేసింది తానే అని రాజశేఖర్ తెలిపారు. ఆ చిత్ర నిర్మాత తన స్నేహితుడే కావడంతో హక్కులు తీసుకున్నానని, ఐతే రైట్స్ గురించి నోటి మాటగా అనుకున్నామే తప్ప, అగ్రిమెంట్ చేసుకోలేదని రాజశేఖర్ తెలిపారు. ఐతే ఈలోపు ఠాగూర్ మధు.. చిరంజీవి గారి కోసం ఆ సినిమా హక్కులు తీసుకోవాలని అనుకున్నారని.. ఆయన ఆ నిర్మాతను కలిసి ఎక్కువ రేటు ఆఫర్ చేశారని.. ఆయన టెంప్ట్ అయి రైట్స్ ఇచ్చేశారని రాజశేఖర్ తెలిపారు.
లిఖిత పూర్వక ఒప్పందం లేకపోవడం వల్ల తాను ఆ విషయంలో ఏమీ చేయలేకపోయానని.. అలా ఠాగూర్ సినిమా తన చేజారిందని రాజశేఖర్ వెల్లడించారు. గతంలో చిన్నతంబి రీమేక్ చంటి విషయంలో కూడా ఇలాంటి వివాదమే నడిచింది. ముందు రాజేంద్రప్రసాద్ ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఆ సినిమా వెంకటేష్ చేతికి వెళ్లిపోయింది. దీనిపై రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆవేదనతో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు.
This post was last modified on April 24, 2026 11:50 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…