టాలీవుడ్లో ఒకప్పుడు రీమేక్లకు పెట్టింది పేరు సీనియర్ హీరో రాజశేఖర్. మొరటోడు నా మొగుడు, సూర్యుడు, బలరామ కృష్ణులు, సింహరాశి, విలన్, సత్యమేవ జయతే, గడ్డం గ్యాంగ్, శేఖర్.. ఇలా లెక్కలేనన్ని రీమేక్ సినిమాలు చేశారాయన. అందులో కొన్ని విజయవంతం అయ్యాయి. కొన్ని ఫెయిలయ్యాయి. ఐతే రాజశేఖర్ తాను మిస్సయిన ఓ రీమేక్ గురించి తరచుగా బాధ పడుతూ ఉంటారు. అదే.. ఠాగూర్.
తమిళంలో విజయ్ కాంత్ హీరోగా మురుగదాస్ రూపొందించిన రమణ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ముందు ఈ సినిమా రీమేక్ హక్కులను తీసుకుంది రాజశేఖరే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి చేతికి వెళ్లిపోయింది. మరి మధ్యలో ఏం జరిగిందన్నది సస్పెన్స్. ఇటీవలే బైకర్ మూవీలో ప్రత్యేక పాత్రలో పలకరించిన రాజశేఖర్.. ఒక ఇంటర్వ్యూలో ఠాగూర్ రీమేక్ విషయంలో తెర వెనుక ఏం జరిగిందో వెల్లడించారు.
రమణ రీమేక్ హక్కులను ముందు కొనుగోలు చేసింది తానే అని రాజశేఖర్ తెలిపారు. ఆ చిత్ర నిర్మాత తన స్నేహితుడే కావడంతో హక్కులు తీసుకున్నానని, ఐతే రైట్స్ గురించి నోటి మాటగా అనుకున్నామే తప్ప, అగ్రిమెంట్ చేసుకోలేదని రాజశేఖర్ తెలిపారు. ఐతే ఈలోపు ఠాగూర్ మధు.. చిరంజీవి గారి కోసం ఆ సినిమా హక్కులు తీసుకోవాలని అనుకున్నారని.. ఆయన ఆ నిర్మాతను కలిసి ఎక్కువ రేటు ఆఫర్ చేశారని.. ఆయన టెంప్ట్ అయి రైట్స్ ఇచ్చేశారని రాజశేఖర్ తెలిపారు.
లిఖిత పూర్వక ఒప్పందం లేకపోవడం వల్ల తాను ఆ విషయంలో ఏమీ చేయలేకపోయానని.. అలా ఠాగూర్ సినిమా తన చేజారిందని రాజశేఖర్ వెల్లడించారు. గతంలో చిన్నతంబి రీమేక్ చంటి విషయంలో కూడా ఇలాంటి వివాదమే నడిచింది. ముందు రాజేంద్రప్రసాద్ ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఆ సినిమా వెంకటేష్ చేతికి వెళ్లిపోయింది. దీనిపై రాజేంద్ర ప్రసాద్ తీవ్ర ఆవేదనతో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు.
This post was last modified on April 24, 2026 11:50 pm
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. బాలీవుడ్ నిర్మాత జాకీ…
టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు…
బాలీవుడ్లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ అందులో డాక్టర్ గా కీలక పాత్ర…
ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం…
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…