Movie News

ఠాగూర్ ఎలా రాజ‌శేఖ‌ర్ చేజారింది?

టాలీవుడ్లో ఒక‌ప్పుడు రీమేక్‌ల‌కు పెట్టింది పేరు సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్. మొర‌టోడు నా మొగుడు, సూర్యుడు, బ‌ల‌రామ కృష్ణులు, సింహ‌రాశి, విల‌న్, స‌త్య‌మేవ జ‌య‌తే, గ‌డ్డం గ్యాంగ్, శేఖ‌ర్.. ఇలా లెక్క‌లేన‌న్ని రీమేక్ సినిమాలు చేశారాయ‌న‌. అందులో కొన్ని విజ‌య‌వంతం అయ్యాయి. కొన్ని ఫెయిలయ్యాయి. ఐతే రాజ‌శేఖ‌ర్ తాను మిస్స‌యిన ఓ రీమేక్ గురించి త‌ర‌చుగా బాధ ప‌డుతూ ఉంటారు. అదే.. ఠాగూర్.

త‌మిళంలో విజయ్ కాంత్ హీరోగా మురుగ‌దాస్ రూపొందించిన ర‌మ‌ణ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ముందు ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను తీసుకుంది రాజ‌శేఖ‌రే అని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కానీ త‌ర్వాత ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి చేతికి వెళ్లిపోయింది. మ‌రి మ‌ధ్య‌లో ఏం జ‌రిగింద‌న్న‌ది స‌స్పెన్స్. ఇటీవ‌లే బైక‌ర్ మూవీలో ప్ర‌త్యేక పాత్ర‌లో ప‌ల‌క‌రించిన రాజ‌శేఖ‌ర్.. ఒక ఇంట‌ర్వ్యూలో ఠాగూర్ రీమేక్ విష‌యంలో తెర వెనుక ఏం జ‌రిగిందో వెల్ల‌డించారు.

రమ‌ణ రీమేక్ హ‌క్కుల‌ను ముందు కొనుగోలు చేసింది తానే అని రాజ‌శేఖ‌ర్ తెలిపారు. ఆ చిత్ర నిర్మాత త‌న స్నేహితుడే కావ‌డంతో హ‌క్కులు తీసుకున్నాన‌ని, ఐతే రైట్స్ గురించి నోటి మాట‌గా అనుకున్నామే త‌ప్ప‌, అగ్రిమెంట్ చేసుకోలేద‌ని రాజ‌శేఖర్ తెలిపారు. ఐతే ఈలోపు ఠాగూర్ మ‌ధు.. చిరంజీవి గారి కోసం ఆ సినిమా హ‌క్కులు తీసుకోవాల‌ని అనుకున్నార‌ని.. ఆయ‌న ఆ నిర్మాత‌ను క‌లిసి ఎక్కువ రేటు ఆఫ‌ర్ చేశార‌ని.. ఆయ‌న టెంప్ట్ అయి రైట్స్ ఇచ్చేశారని రాజ‌శేఖ‌ర్ తెలిపారు.

లిఖిత పూర్వ‌క ఒప్పందం లేక‌పోవ‌డం వ‌ల్ల తాను ఆ విష‌యంలో ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని.. అలా ఠాగూర్ సినిమా త‌న చేజారింద‌ని రాజ‌శేఖర్ వెల్ల‌డించారు. గ‌తంలో చిన్న‌తంబి రీమేక్ చంటి విష‌యంలో కూడా ఇలాంటి వివాద‌మే న‌డిచింది. ముందు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఈ సినిమాను రీమేక్ చేయాల‌నుకున్నారు. కానీ తర్వాత ఆ సినిమా వెంక‌టేష్ చేతికి వెళ్లిపోయింది. దీనిపై రాజేంద్ర ప్ర‌సాద్ తీవ్ర ఆవేద‌న‌తో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

30 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago