అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రం దర్శకుడు అనురాగ్ బసు డైరెక్షన్లో జరగనున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీని ముంబై వర్గాలు ఆషీకీ 3గా పిలుచుకుంటున్నాయి. అయితే ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా టీమ్ సైలెంట్ ఉంది. నిజానికిది గత ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది.
ట్విస్టు ఏంటంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటిదాకా కేవలం నలభై రోజులు మాత్రమే అయ్యిందట. అంటే సగం కూడా లేదన్న మాట. అలాంటప్పుడు రిలీజ్ గురించి ఇంతకు ముందు వార్తలు ఎలా వచ్చాయంటే ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ బయోపిక్ స్క్రిప్ట్ పనిలో ఉన్న అనురాగ్ బసు మరి కార్తీక్ శ్రీలీల ప్రాజెక్టుని పక్కన పెట్టారా లేక ఆర్థిక కారణాల వల్ల ఏమైనా వాయిదా పడిందా అనేది తెలియడం లేదు.
ప్రస్తుతానికి దీని గురించి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. అనురాగ్ బసు మాత్రం ఇది చేస్తాననే తరహాలో మాట్లాడుతున్నారు కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడే కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ఏదో ఉందంటూ నార్త్ మీడియా వర్గాలు కథనాలు వడ్డించాయి. దానికి తగ్గట్టే శ్రీలీల వాళ్ళ ఇంటికి వెళ్లినట్టుగా వచ్చిన లీక్స్ వాటికి బలాన్ని చేకూర్చాయి. తర్వాత అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలని తేలిపోవడం వేరే విషయం.
అర్జెంట్ గా శ్రీలీలకో హిట్టు కావాలి. ఎవరితో నటించినా ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద గంపెడు ఆశలు పెట్టుకుంటే అదేమో పిడికెడు కూడా తీర్చలేదు. తమిళంలో పరాశక్తి తనకు ఆఫర్ల వర్షం కురిపిస్తుందనుకుంటే శివ కార్తికేయన్ కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాపుగా నిలిచింది. అంతకు ముందు శ్రీలీల ట్రాక్ రికార్డు తెలిసిందే. మరి కార్తీక్ ఆర్యన్ తో చేసిన హిందీ తెరంగేట్రం గురించి ఎప్పుడు చెబుతుందో చూడాలి.
This post was last modified on April 22, 2026 11:29 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…