ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని జనాలు నమ్మకం పెట్టుకునే స్థాయిలో క్రెడిబిలిటీ సంపాదించుకుంది ఆ సంస్థ. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’తో మొదలుపెట్టి.. అనగనగా, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఆల్ ఇండియా ర్యాంకర్స్.. ఇలా మంచి మంచి కంటెంట్ అందించిన ఘనత ఆ సంస్థ సొంతం.
ఏదో ఒక కొత్తదనం లేకుండా.. ఎంగేజింగ్ కంటెంట్ లేకుండా వాళ్లు ఏ సినిమా, సిరీస్ తీయరనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. కానీ ఈ మధ్య ఆ సంస్థ క్రెడిబిలిటీని దెబ్బ తీసే సినిమాలు వస్తున్నాయి. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించి, బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తున్న సినిమాలు.. అంచనాలను అందుకోలేక, ప్రేక్షకులను విసుగెత్తించి ఆ సంస్థ మీద నమ్మకాన్ని పోగొడుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో ఇలాంటి చిత్రాలు రెండు వచ్చాయి.
మార్చిలో వచ్చిన శివాజీ సినిమా ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని’ చూసి ప్రేక్షకులు బెంబేలెత్తిపోయాయి. నేరుగా ఈటీవీ విన్లో రిలీజ్ చేయాలనుకున్న సినిమాను.. వెండితెరపై అద్భుతాలు చేస్తుందన్న ధీమాతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ సీరియల్ను తలపించిన ఆ సినిమా.. ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. థియేటర్లలో ఈ సినిమా కనీస ప్రభావం కూడా చూపించలేకపోయింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసిన వాళ్లంతా తిట్టుకున్నారు.
ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ సినిమా సైతం అదే ఫీలింగ్ కలిగించింది. ఈ సినిమాను టీం మామూలుగా ప్రమోట్ చేయలేదు. దాని కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా పెట్టారు. తీరా చూస్తే ప్రోమోల్లో ఉన్నంత ఆసక్తి సినిమాలో లేకపోయింది.
చిన్న పాయింట్ పట్టుకుని విపరీతంగా సాగతీసి ప్రేక్షకులకు తీవ్ర అసహనం కలిగించాడు దర్శకుడు. ఈ మాత్రం కంటెంట్ గురించా ఇంత హడావుడి చేశారు అనే ఫీలింగ్ కలిగింది జనాలకు. ఈ సినిమాకు పెట్టిన ప్రొడక్షన్ బడ్జెట్, ప్రమోషన్ల ఖర్చు కలిపితే 7-8 కోట్ల దాకా అయిందట. కానీ థియేటర్ల నుంచి కోటి రూపాయల షేర్ కూడా రాని పరిస్థితి.
డిజిటల్ రిలీజ్తో ఎంత మాత్రం ప్రయోజనం పొందుతారో కానీ.. బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం సినిమా డిజాస్టర్గానే నిలిచింది. ఈటీవీ విన్ నెలన్నర వ్యవధిలో రెండు పేలవమైన సినిమాలు రావడం ఆ సంస్థ ఇమేజీకి పెద్ద డ్యామేజే. ఇకపై ఈటీవీ విన్ సినిమాలు అంటే ప్రేక్షకులు కొంచెం ఆలోచించే థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…