మన దగ్గర మిడ్ రేంజ్ హీరోల మీద వంద కోట్ల బడ్జెట్లు పెట్టేస్తున్నారు నిర్మాతలు. తీరా చూస్తే తెర మీద ఆ ఖర్చుకు తగ్గ ఔట్ పుట్ కనిపించదు. మామూలు సినిమాలకు కూడా నెలలు, సంవత్సరాలు సమయం తీసుకుంటూ ఉంటారు. అంత సుదీర్ఘ కాలం తీసిన సినిమాల్లో చివరికి కంటెంట్ చూస్తే అంతంతమాత్రంగా ఉంటుంది. విషయం బలంగా లేకుండా ఎంత ఖర్చు పెట్టి హంగులు జోడించినా, ఎంత భారీతనం ఉన్నా అవేమీ సినిమాకు అక్కరకు రావని అనేక సినిమాలు రుజువు చేస్తూనే ఉన్నాయి.
కానీ మలయాళంలో మాత్రం వ్యవహారం ఇలా ఉండదు. అక్కడ ఫోకస్ అంతా కథ మీదే ఉంటుంది. పరిమిత బడ్జెట్లలో, తక్కువ రోజుల్లో సినిమాలు పూర్తి చేస్తారు. స్టార్లను కాకుండా కథను నమ్ముకుని, కొత్త వాళ్లతోనే అద్భుతాలు ఆవిష్కరిస్తుంటారు. బాక్సాఫీస్ దగ్గర ఆ చిన్న బడ్జెట్ చిత్రాలకే భారీ వసూళ్లు వస్తుంటాయి. ఇటీవల మలయాళం బాక్సాఫీస్లో ఒక చిన్న సినిమా ఇలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే.. వాళా-2.
స్కూల్ పిల్లల కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటించారు. బడ్జెట్ కేవలం రూ.10 కోట్లు. ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధించడం గురించి కొన్ని రోజుల ముందు అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఐతే ఈ చిన్న సినిమా సంచలనం అంతటితో ఆగిపోలేదు. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల మైలురాయిని అందుకుంది. విడుదలైన 20 రోజుల్లోనే ‘వాళా-2’ ఈ ఘనత సాధించడం విశేషం. మూడో వారంలోనూ కొత్త సినిమాలా హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అవుతోంది ఈ మూవీ. కేరళలో ఈ సినిమాకు ఈ వీకెండ్లో టికెట్లు దొరకడం కష్టంగా ఉంది.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి లాంటి నగరాల్లోనూ ఈ సినిమాకు అదిరే స్పందన వస్తోంది. మలయాళ వెర్షన్ను ఎగబడి చూస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే వారం తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో టాలీవుడ్కు చెందిన సాహు గారపాటి కూడా ఒకరు కావడం విశేషం. ఈ సంక్రాంతికి తెలుగులో ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన.. ఇప్పుడు మలయాళంలో ‘వాళా-2’ రూపంలో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
This post was last modified on April 19, 2026 4:21 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…