జూన్ 4 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న టాక్సిక్ మళ్ళీ వాయిదా పడుతుందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా తిరుగుతోంది. టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాక పోవడం, దీనికన్నా ముందే యష్ రామాయణ ప్రమోషన్లలో దిగడం లాంటి పరిణామాలు అనుమానాలను మరింత బలపడేలా చేస్తున్నాయి. పైగా కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన మరో సినిమా కెడి ది డెవిల్ ఏప్రిల్ 30 రిలీజ్ కావాల్సి ఉండగా దాని పబ్లిసిటీ ఇంకా మొదలుపెట్టకపోవడం ఇంకో ట్విస్టు.
ఇదంతా ఎలా ఉన్నా టాక్సిక్ వచ్చినా రాకపోయినా జూన్ 4 పెద్ది విడుదల చేయాలని దాదాపుగా నిర్ణయించినట్టు అంతర్గత వర్గాల సమాచారం. ఒకవేళ టాక్సిక్ మాట మీద ఉండే పక్షంలో దానితో నేరుగా క్లాష్ అయినా పర్వాలేదనే తరహాలో ప్లాన్ చేస్తునట్టుగా తెలిసింది. టాక్సిక్ ఏపీ తెలంగాణ హక్కులు దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే. పెద్దిలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. సో క్లాష్ కన్ఫర్మ్ అయితే పోటీ రసవత్తరంగా ఉంటుంది.
ఒకవేళ టాక్సిక్, పెద్ది పరస్పరం తలపడితే ఎవరికి ఎక్కువ రిస్కో చూద్దాం. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే రామ్ చరణ్ ఇమేజ్, పెద్ది మీద ముందు నుంచి నెలకొన్న క్రేజ్, మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు చాలా పాజిటివ్ గా పని చేస్తాయి. అటు బాలీవుడ్ లో రెహమాన్ పాటలు ముందుగానే చొచ్చుకుపోయాయి. ట్రైలర్ వచ్చాక హైప్ పుష్ప రేంజ్ లో ఉంటుందని ఆల్రెడీ టాక్ ఉంది. సో ఎంత లేట్ అయినా ఎన్ని వాయిదాలు పడినా పెద్ది బజ్ కొచ్చిన చిక్కేమి లేదనేది స్పష్టం.
కానీ టాక్సిక్ కు ఇన్ని సానుకూలతలు లేవు. టీజర్ కు మిశ్రమ స్పందన దక్కింది. రిలీజ్ చేసిన మెలోడీ సాంగ్ విజువల్స్ లేకుండా కేవలం లిరిక్స్ తో వచ్చి మూవీ లవర్స్ ని తప్ప సామాన్య ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కెజిఎఫ్ తో యష్ కి ఇండియా వైడ్ మార్కెట్ వచ్చిన మాట వాస్తవమే కానీ టాక్సిక్ కి మళ్ళీ ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకోవాలి. పెద్ది వల్ల కర్ణాటక తప్ప ఇతర చోట్ల టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. చూడాలి జూన్ 4 ఎవరో ఒకరు వస్తారా లేక ఇద్దరూ తలపడతారా.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…