ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. తాజాగా వారణాసికి సంబంధించి ఒక వాటర్ ఎపిసోడ్ తాలూకు విజువల్స్ కొన్ని బయటికి వచ్చాయనే వార్త బయటికి రావడంతో మహేష్ బాబు అభిమానులు అలెర్ట్ అయిపోయారు. గతంలో ఇదే తరహాలో మహేష్ బాబు – పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య ఒక కీలకమైన ఎపిసోడ్ కు సంబంధించిన క్లిప్పు వైరలైన సంగతి తెలిసిందే.
తర్వాత ఇప్పుడు మళ్ళీ గంగ నందిలో మహేష్ పడవ మీద వెళ్లే లాంగ్ విజువల్ చక్కర్లు కొడుతున్నట్టుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు కనపడుతున్నాయి. నిజానికి రాజమౌళి వీటి వల్ల ఆందోళన చెందే టైపు కాదు. ఎందుకంటే రా వీడియోలో మనం ఏదైతే చూస్తామో దానికి ఫైనల్ అవుట్ ఫుట్ కి నక్కకి నాగలోకంకి ఉన్నంత తేడా ఉంటుంది. ఇదేమి కొత్త కాదు. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని పులి వెంబడించే సీన్ షూటింగ్ టైంలోనే లీకయ్యింది. కానీ తీరా సినిమాలో చూశాక దాని ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది.
బాహుబలి టైంలో ప్రభాస్, అనుష్క రాజ్యాల మధ్య ఒక వార్ ఎపిసోడ్ నుంచి చిన్న సీన్ ఇదే తరహాలో ఎడిటింగ్ రూమ్ కు వెళ్లకుండానే బయటికి వచ్చింది. అసలది సినిమాలో లేకుండా లేపేయడం రాజమౌళికి మాత్రమే సాధ్యమైన విద్య. సో ఇప్పుడు వారణాసి నుంచి వచ్చిన లీకులు స్పష్టంగా లేకపోవడం పక్కనపెడితే వాటి వల్ల ఏదో కొంపలు అంటుకుపోతాయనే రేంజ్ లో జక్కన్న టీమ్ ఆర్తనాదాలు పెట్టదు. కూల్ గా వాటిని తీయించేసి తన పని తాను చేసుకుంటుంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మిస్ కాకుండా పక్కా ప్లానింగ్ తో ఉంది. ఈ సంవత్సరంలోనే షూటింగ్ పూర్తి చేసి మూడు నెలలు పూర్తిగా గ్లోబల్ ప్రమోషన్ మీద దృష్టి పెట్టబోతున్నారు రాజమౌళి. ఇప్పటిదాకా ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ తప్ప ఇతర ఆర్టిస్టులు ఎవరు ఉన్నారో కూడా బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్న రాజమౌళి ఈసారి మాత్రం వాయిదాల ప్రసక్తే లేదంటున్నారు. కీరవాణి ప్రస్తుతం ట్యూన్స్ కంపోజ్ చేసే పనిలో ఉన్నారు.
This post was last modified on April 13, 2026 11:46 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…