లాక్ డౌన్ టైంలో సౌత్ ఇండియాలో కొత్త సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసే విషయంలో నిర్మాతలు తటపటాయిస్తున్న సమయంలో సూర్య ధైర్యం చేసిన తన భార్య జ్యోతిక నటించిన పొన్ మగల్ వందాల్ను డిజిటల్ మీడియంలో రిలీజ్ చేసి సంచలనానికి తెర తీశాడు.
తమిళనాట ఎగ్జిబిటర్లు అడ్డంకులు సృష్టించినా అతను ఆగలేదు. అతడిచ్చిన స్ఫూర్తితోనే తర్వాత దక్షిణాదిన వివిధ భాషల్లో కొత్త సినిమాలను ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. భార్య సినిమా తర్వాత సూర్య.. తాను నటించిన భారీ చిత్రం ఆకాశం నీ హద్దురాను సైతం అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయడానికి సాహసించి ఆశ్చర్యపరిచాడు.
ఇంత పెద్ద సినిమాకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయడం కరెక్టా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ సూర్య ధైర్యం చేశాడు. అందుకు మంచి ఫలితమే దక్కింది. ఓటీటీ రిలీజ్ల్లో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఇదే.
అన్న స్ఫూర్తితో ఇప్పుడు తమ్ముడు కార్తి కూడా ఓటీటీ బాట పడుతున్నట్లు సమాచారం. అతడి కొత్త సినిమా సుల్తాన్ ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతోందట. ఈ చిత్రాన్ని డిస్నీ+ హాట్ స్టార్ వాళ్లు కొంటున్నారట. ఈ దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయట. తమిళనాట థియేట్రికల్ రిలీజ్ కోసం మాస్టర్ సహా చాలా సినిమాలు వరుసలో ఉన్నాయి. వాటితో పోటీ పడటం కన్నా మంచి ఆఫర్ వస్తే ఓటీటీ రిలీజే మేలని నిర్మాత సురేష్ ప్రభు భావిస్తున్నాడట.
ఖైదీ తర్వాత కార్తి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో సుల్తాన్ తెరకెక్కింది. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కన్నడ అమ్మాయి రష్మిక మందన్నా ఈ చిత్రంతోనే తమిళంలో అడుగు పెడుతుండటం విశేషం.
This post was last modified on December 27, 2020 10:07 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…