పెద్ది వాయిదాలతో అభిమానులు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు. మార్చి 26, ఏప్రిల్ 30 రెండు మంచి డేట్లు మిస్సైపోయాయి. కొత్త తేదీని ఇంకా ప్రకటించ లేదు. అసలు ఐటెం సాంగ్ లో డాన్స్ చేయబోయే హీరోయిన్ ఎవరో దర్శకుడు బుచ్చిబాబు ఇంకా తేల్చలేదనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. పెద్ది విడుదలకు సిద్ధమైతే తప్ప చరణ్ నెక్స్ట్ చేయబోయే సుకుమార్ మూవీని పట్టాలు ఎక్కించలేడు. ఆల్రెడీ దాని స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా బాలీవుడ్ కల్ట్ ఫిలిం మేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఒక ప్యాన్ ఇండియా మూవీ అది కూడా రామ్ చరణ్ తో చేసే ప్రణాళికలో ఉన్నట్టు ముంబై మీడియా రిపోర్ట్. ఈయన ప్రస్తుతం రన్బీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ కాంబినేషన్ లో లవ్ అండ్ వార్ తీస్తున్నారు. ఈ ఏడాదే రిలీజ్ కావాల్సింది కానీ ప్రొడక్షన్, విఎఫెక్స్ వల్ల బాగా లేట్ అయిపోయింది. ఎలాగూ దీపావళికి రామాయణ వస్తుంది కాబట్టి లవ్ అండ్ వార్ ని 2027కి షిఫ్ట్ చేశారు.
ఇక సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే రామ్ చరణ్, భన్సాలీ కాంబో కుదిరితే మంచిదే. విజువల్ గ్రాండియర్స్ ని ఎమోషన్స్ తో బ్యాలన్స్ చేస్తూ ఎన్నో గొప్ప సినిమాలు తీసిన సంజయ్ లీలా భన్సాలీ తనదైన ముద్రతో గంగూభాయ్ కటియావాడి, పద్మావత్, బాజీరావు మస్తానీ లాంటి క్లాసిక్స్ ఇచ్చారు. రామ్ చరణ్ ని యుద్ధ వీరుడిగానో లేదా చారిత్రక పురుషుడిగానో చూపిస్తే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతాయి. ప్రస్తుతానికి ఇదంతా గాసిప్ స్టేజిలో ఉంది.
కాంబినేషన్ల ఎంపిక ఎలా ఉన్నా రామ్ చరణ్ వేగం పెంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా ఇవ్వాలని, ఇండస్ట్రీకి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా పదహారో మూవీ దగ్గరే ఉండటం వాళ్ళ అసంతృప్తికి కారణం. పవన్ కళ్యాణ్ లాగా రాజకీయాల్లో బిజీగా ఉంటే అది వేరే విషయం కానీ చరణ్ కు అలాంటి టెన్షన్లేవి లేవు. అయినా సరే ఆర్ఆర్ఆర్ తెచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ కాపాడుకునేందుకు సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…
ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…