ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే సినిమా వచ్చేది. దీంతో రిలీజ్ డేట్ను బట్టి చాలా ముందు నుంచే ప్రేక్షకులు కౌంట్ డౌన్లు కూడా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పదిలో ఏడెనిమిది సినిమాలు వాయిదా పడుతున్నాయి. డేట్లు మార్చుకుంటున్నాయి.
ఈ రిలీజ్ డేట్లు మార్చే ట్రెండు ఊపందుకోవడంలో రాజమౌళి పాత్ర కొట్టిపారేయలేనిది. ఆయన తీసిన ఏ భారీ చిత్రమూ చెప్పిన రిలీజ్ డేట్కు రాలేదు. జక్కన్న చివరి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మొదలైనపుడు 2020లో రిలీజ్ పక్కా అని చెప్పి.. చివరికి 2022లో విడుదల చేశాడు. కాకపోతే జక్కన్న ఆలస్యంతో పాటు కొవిడ్ ప్రభావం కూడా ఆ సినిమా అంత లేటుగా రిలీజైంది.
కానీ ఇప్పుడు రాజమౌళి నుంచి రాబోతున్న ‘వారణాసి’ మాత్రం పక్కాగా చెప్పిన డేటుకే వస్తుందని అంటున్నారు. నిజంగా అది జరిగితే మాత్రం వచ్చే ఏడాది ఇదే రోజు బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం.
ఈ రోజు 2025 ఏప్రిల్ 7. వచ్చే ఏడాది ఇదే డేటుకి ‘వారణాసి’ విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు 1 ఇయర్ కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. ‘వారణాసి’పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమాలే తీశాడు జక్కన్న. ఇది పాన్ వరల్డ్ మూవీ.
హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సహా అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ వారికి విపరీంగా నచ్చేసి.. జక్కన్న నెక్స్ట్ మూవీ మీద అంచనాలు పెట్టేసుకున్నారు. గత ఏడాది రిలీజైన ‘వారణాసి’ గ్లింప్స్ చూశాక ఇది ‘బాహుబలి’ తరహాలో పెను సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
కాబట్టి 2027 ఏప్రిల్ 7న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలైపోవడం లాంఛనమే. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. ఓవరాల్ రికార్డులన్నీ బద్దలు కావడానికి రెండు వారాల సమయం చాలు. మరి జక్కన్న చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసి, ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఏప్రిల్ 7న చిరస్మరణీయమైన తేదీగా మారుస్తాడేమో.
This post was last modified on April 7, 2026 8:02 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…