ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్. నాలుగు వేల కోట్లతో తీశారు కాబట్టి మతిపోయే స్థాయిలో ఉంటుందని ప్రిపేర్ అయిన ప్రేక్షకులకు అందులో కంటెంట్ షాక్ ఇచ్చింది. క్వాలిటీ తక్కువ విఎఫ్ఎక్స్, ఏఐ వాడకం, సరిగా కట్ చేయని విజువల్స్ వెరసి ఊహించని విధంగా ట్రోలింగ్ కు దారి తీసింది. ఇది వచ్చాక ఆదిపురుష్ ఓంరౌత్ ని ఒక రౌండ్ వేద్దామనుకున్న మీమర్స్ హఠాత్తుగా రూటు మార్చాల్సి వచ్చింది.
సరే దాని సంగతి పక్కనపెడితే టీజర్ లాంచ్ సందర్భంగా రన్బీర్ కపూర్ రామాయణ నిడివిని రివీల్ చేశాడు. ఒక విదేశీ జర్నలిస్టుతో మాట్లాడుతూ మీరు చూసింది కేవలం శాంపిలేనని, అసలైన ఆరు గంటల అద్భుతమైన కంటెంట్ తమ దగ్గర ఉందని అన్నాడు. ఇప్పుడు సవాల్ ఇదే. రన్బీర్ చెప్పింది రెండు భాగాలు కలిపిన నిడివే అయినా ఇప్పటికే కొన్ని వందలసార్లు చూసిన కథను మళ్ళీ అంత లెన్త్ తో చూపిస్తే జెన్ జీ ఆడియన్స్ ఓపికగా చూస్తారానే ప్రశ్న తలెత్తుతుంది.
ఒకప్పుడు తొంభై దశకంలో రామాయణ సీరియల్ అన్ని ఎపిసోడ్ల నిడివి 45 గంటలు. జనం బ్రహ్మరథం పట్టారు. శోభన్ బాబు సంపూర్ణ రామాయణం మూడు గంటల పది నిముషాలు ఉంటుంది. బ్లాక్ బస్టర్ చేశారు. లవకుశ మూడున్నర గంటలకు పైనే ఉన్నా అణా పైసా టికెట్ రేట్లతోనే కోట్లు కొల్లగొట్టింది. కానీ ఇప్పటి తరం వేరు. బాపు గారు శ్రీరామరాజ్యంని గొప్పగా తీసినా ఎబోవ్ యావరేజ్ అయ్యింది. ఇక ఆదిపురుష్ సంగతి సరేసరి. ప్రభాస్ అభిమానులే తిరస్కరించారు.
రామాయణ ఈ సవాళ్లు అన్నీ ఎదురుకోవాలి. గ్రాఫిక్స్ నెవెర్ బిఫోర్ అనేలా ఉంటాయని బాకాలు ఊడడం బాగానే ఉంది కానీ ఆ ఫీల్ ని టీజర్ ట్రైలర్ స్థాయిలోనే ఆడియన్స్ ఫీలవ్వాలి. అంతే తప్ప ఏముందనే భావన రాకూడదు. రామాయణ టీమ్ ముందైతే క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలి. ఎలివేషన్ల ట్రెండ్ లో ఊగిపోతున్న ఇప్పటి జనరేషన్ ని సీతారాముల కథతో రెండు భాగాలుగా ఆరు గంటలు మెప్పించడం కత్తి మీద సామే. మరి దర్శకుడు నితేశ్ తివారి దానికి ఎలాంటి బదులు ఇస్తారో.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…