మలయాళ స్టార్ హీరో టొవినో థామస్.. తాను జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) మూవీలో ఎందుకు నటించట్లేదో వివరించి చెప్పడం చర్చనీయాంశంగా చెప్పిన సంగతి తెలిసిందే. ముందు టొవినో ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాను ఆ సినిమా చేయట్లేదని.. తెలుగులో సినిమాల చిత్రీకరణ సుదీర్ఘంగా, ఎక్కువ షెడ్యూల్స్లో జరుగుతుందని.. ఇక్కడ ఒక సినిమా చేస్తే తాను నటించే నాలుగైదు సినిమాల మీద ప్రభావం పడుతుందని వివరించాడు టొవినో.
ఐతే తాను ఇంత వివరంగా విషయం చెప్పినా.. జనం మాత్రం మరోలా తన వ్యాఖ్యలను అర్థం చేసుకున్నాడంటూ ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు టొవినో. తనకు డ్రాగన్ సినిమాలో నటించడం ఇష్టం లేదన్నట్లుగా తన వ్యాఖ్యలను ప్రొజెక్ట్ చేయడం పట్ల టొవినో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారణంతోనే తాను ఎక్కువగా మౌనం వహిస్తుంటానని అతనన్నాడు.
”నిన్న ఒక ప్రెస్ మీట్లో ఓ విషయం మీద మాట్లాడాను. కానీ నా మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. డ్రాగన్ సినిమాలో నటించడం నాకు అస్సలు ఇష్టం లేదన్నట్లుగా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఏమైనా మాట్లాడితే ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టే నేను మౌనం వహిస్తుంటా. ఒకే సమయంలో నేను వేర్వేరు పనులు చేయలేను. ఇదొక భిన్నమైన వర్కింగ్ స్టైల్.
దీన్నే ఎంతో కాలం నుంచి అనుసరిస్తున్నా. కానీ నా మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. నాకు సినిమాల్లో నటించడం ఇష్టం. డబ్బు లేదా స్టార్డం కంటే మూవీ మేకింగ్ ప్రాసెస్ను నేనె ఎక్కువ ఎంజాయ్ చేస్తాను” అని టొవినో తెలిపాడు.
తనకు దర్శకుడు ప్రశాంత్ అంటే ఎంతో ఇష్టమన్న టొవినో.. ఆయన వర్కింగ్ స్టైల్ను ఇష్టపడతానన్నాడు. తాను భాగం కాకపోయినప్పటికీ.. డ్రాగన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని టొవినో ఆకాంక్షించాడు. టొవినో హీరోగా నటించిన పల్లిచట్టంబి ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఫంకీ భామ కాయదు లోహర్ కథానాయికగా నటించింది.
This post was last modified on April 1, 2026 10:20 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…