Movie News

నయన్ అడిగినంత ఇవ్వకుండా.. అంతకుమించి..?

​సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా నయనతార పేరు గట్టిగా వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సల్మాన్ ఖాన్ లాగే నయనతార కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌ను ఎంచుకున్నట్లు టాక్ నడుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు మాత్రమే తీసుకునే ఈ తరహా డీల్‌ను ఒక హీరోయిన్ ఓకే చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

​నయనతార గతంలో ‘జవాన్’ సినిమా కోసం సుమారు 10 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో తన క్రేజ్‌ను బట్టి రెమ్యూనరేషన్ మరింత పెంచినట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా కొన్ని ఆఫర్లు వచ్చినా, ఆమె అడిగే నంబర్లకు భయపడి నిర్మాతలు వెనకడుగు వేశారు.

కానీ ఈ బాలీవుడ్ సినిమా కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి ఆమెనే కావాలని పట్టుబట్టడంతో, దిల్ రాజు ఈ దారి వెతికారని తెలుస్తోంది. రెమ్యూనరేషన్ రూపంలో పెద్ద మొత్తం ఇచ్చి రిస్క్ తీసుకోకుండా, సినిమా బిజినెస్ లేదా లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

​సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమా కోసం కేవలం కొంత మొత్తాన్ని తీసుకుని, మిగతాది లాభాల్లో షేర్ రూపంలో తీసుకోవడానికి మొగ్గు చూపారని తెలుస్తోంది. ఒక టాప్ హీరోతో సమానంగా హీరోయిన్ కూడా బిజినెస్ డీల్ కుదుర్చుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.

ఒక ఫిక్స్‌డ్ అమౌంట్‌తో సరిపెట్టుకోకుండా, సినిమా రిజల్ట్‌ను బట్టి తన ఆదాయం ఉండేలా నయన్ ప్లాన్ చేయడం గమనార్హం. ​ఈ సినిమాను 2027 ఈద్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక క్లాస్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో నయనతార పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అందుకే దిల్ రాజు కూడా రెండు వైపులా ఇబ్బంది లేకుండా ఈ ప్రాఫిట్ షేర్ పద్ధతిని అమలు చేసినట్లు సినీ వర్గాల్లో ఒక గాసిప్ నడుస్తోంది.

This post was last modified on March 29, 2026 4:24 pm

Share

Recent Posts

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

46 minutes ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

1 hour ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

2 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

4 hours ago

బాలయ్య చెప్పేదాకా నమ్మలేని విషయమది

నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…

6 hours ago

అప్పట్లో బాబు అసెంబ్లీకి రాకపోయినా…

ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో…

6 hours ago