Movie News

నయన్ అడిగినంత ఇవ్వకుండా.. అంతకుమించి..?

​సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా నయనతార పేరు గట్టిగా వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సల్మాన్ ఖాన్ లాగే నయనతార కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌ను ఎంచుకున్నట్లు టాక్ నడుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు మాత్రమే తీసుకునే ఈ తరహా డీల్‌ను ఒక హీరోయిన్ ఓకే చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

​నయనతార గతంలో ‘జవాన్’ సినిమా కోసం సుమారు 10 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో తన క్రేజ్‌ను బట్టి రెమ్యూనరేషన్ మరింత పెంచినట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా కొన్ని ఆఫర్లు వచ్చినా, ఆమె అడిగే నంబర్లకు భయపడి నిర్మాతలు వెనకడుగు వేశారు.

కానీ ఈ బాలీవుడ్ సినిమా కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి ఆమెనే కావాలని పట్టుబట్టడంతో, దిల్ రాజు ఈ దారి వెతికారని తెలుస్తోంది. రెమ్యూనరేషన్ రూపంలో పెద్ద మొత్తం ఇచ్చి రిస్క్ తీసుకోకుండా, సినిమా బిజినెస్ లేదా లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

​సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమా కోసం కేవలం కొంత మొత్తాన్ని తీసుకుని, మిగతాది లాభాల్లో షేర్ రూపంలో తీసుకోవడానికి మొగ్గు చూపారని తెలుస్తోంది. ఒక టాప్ హీరోతో సమానంగా హీరోయిన్ కూడా బిజినెస్ డీల్ కుదుర్చుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.

ఒక ఫిక్స్‌డ్ అమౌంట్‌తో సరిపెట్టుకోకుండా, సినిమా రిజల్ట్‌ను బట్టి తన ఆదాయం ఉండేలా నయన్ ప్లాన్ చేయడం గమనార్హం. ​ఈ సినిమాను 2027 ఈద్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక క్లాస్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో నయనతార పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అందుకే దిల్ రాజు కూడా రెండు వైపులా ఇబ్బంది లేకుండా ఈ ప్రాఫిట్ షేర్ పద్ధతిని అమలు చేసినట్లు సినీ వర్గాల్లో ఒక గాసిప్ నడుస్తోంది.

Kumar

Recent Posts

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

8 minutes ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

2 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

2 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

2 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

3 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

4 hours ago