ఓటీటీల్లో మలయాళం సినిమాలను కొన్నేళ్లుగా విరగబడి చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అక్కడి సినిమాల్లో కంటెంట్ చూసి ఇలాంటివి తెలుగులో తీయరేంటి అని మన ప్రేక్షకులు బాధ పడడం మామూలే. అదే సమయంలో ఇక్కడ ఏదైనా మంచి సినిమా వచ్చి ఆదరణకు నోచుకోకపోతే.. మనోళ్లు మలయాళం సినిమాలు చూస్తారు కానీ, మన చిత్రాలను పట్టించుకోరంటూ ఇక్కడి ఫిలిం మేకర్స్ ఫీలవుతుంటారు.
ప్రెస్ మీట్లలో కూడా మలయాళం చిత్రాల ప్రస్తావన రావడం.. జర్నలిస్టులు మన చిత్రాలను అక్కడి వాటితో పోల్చి మాట్లాడడం మామూలే. శనివారం ముహూర్త వేడుక జరుపుకున్న ‘బరి’ సినిమా ప్రెస్ మీట్లో ఇలాంటి ప్రస్తావనే వస్తే.. దర్శకుడు యదువంశీ భలే స్టేట్మెంట్ ఇచ్చాడు.
‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో ఆకట్టుకున్న యదువంశీ.. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను హీరోగా పెట్టి ‘బరి’ తీస్తున్నాడు. ఇది వాలీబాల్ నేపథ్యంలో సాగే రూరల్ డ్రామా అని ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో.. ఫస్ట్ పోస్టర్ చూస్తే మలయాళం చిత్రాలు గుర్తుకు వస్తున్నాయని, అక్కడే ఇలాంటి కంటెంట్ సినిమాలు వస్తాయని ఓ జర్నలిస్ట్ ప్రస్తావించగా, దానికి యదువంశీ బదులిస్తూ..
‘‘సార్ ఇక మలయాళం గురించి మాట్లాడక్కర్లేదు. మేమున్నాం. మేం తీస్తాం. మన సినిమాలు.. మన కథలు.. మన విలువలతో మేం సినిమాలు తీయగలం. నేను తీసి చూపిస్తాను. నాలాగే చాలామంది ఫిలిం మేకర్స్ ఉన్నారు. నిహారిక లాంటి నిర్మాతలు ఉన్నారు. అవకాశాలు రాక చాలామంది కృష్ణానగర్లోనో, ఫిలిం నగర్లోనో ఉండిపోతున్నారు. నాకు ఛాన్స్ దొరికింది. నేను చూపిస్తాం. మలయాళం, తమిళం అక్కర్లేదు. మనమే అక్కడికి వెళ్దాం’’ అంటూ చాలా ధీమాగా మాట్లాడాడు యదువంశీ.
క్రికెట్లాగా వాలీబాల్ పాపులర్ కాదు కదా అని అడిగితే.. ‘‘ఏ ఆటకు ఆ ఆటే. మనకు రగ్బీ తెలుసా. అప్పట్లోనే రాజమౌళి గారు సై సినిమా తీశారు. ఇప్పటివరకు వాలీబాల్ సినిమాను స్క్రీన్ మీద చూడలేదు. మేం కచ్చితంగా కొత్తగా చూపిస్తాం’’ అని యదువంశీ చెప్పాడు. తన కాన్ఫిడెన్ చూస్తే ‘బరి’ చాలా స్పెషల్ మూవీ కాగలదనే అంచనాలు ఏర్పడ్డాయి. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాన్ని నిర్మించిన నిహారిక కొణిదెలనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సినిమా ముహూర్త వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
This post was last modified on March 28, 2026 2:13 pm
తొమ్మిదేళ్ల కిందట ‘బాహుబలి: ది కంక్లూజన్’ బాక్సాఫీస్ దగ్గర మామూలు ప్రభంజనం సృష్టించలేదు. అప్పటిదాకా ఉన్న అన్ని ఇండియన్ బాక్సాఫీస్…
ఏపీ అసెంబ్లీలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ కమెడియన్…
ఈ రోజు ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కాబోతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పెద్ద షాకే ఇచ్చింది. ఆ…
నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార…
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన…
వరుణ్ తేజ్ హీరోగా యుదు వంశీ దర్శకత్వం వహించే బరి షూటింగ్ ఇవాళ లాంఛనంగా ప్రారంభమయ్యింది. నీహారిక కొణిదెల నిర్మాత…