మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ ఓ హిలేరియస్ కాన్సెప్ట్తో తెరకెక్కింది. పెళ్లంటే నూరేళ్ల మంట అని బలంగా నమ్మే కుర్రాడు.. తన లాంటి బ్యాచిలర్లందరినీ వెంటేసుకుని పెళ్లికి వ్యతిరేకంగా పోరాడటం.. కానీ మధ్యలో ఓ అమ్మాయి అతడి జీవితంలోకి ప్రవేశించి తన ఆలోచనలు మార్చడం.. ఈ సంఘర్షణలో పుట్టే కామెడీ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. దీని ట్రైలర్ చాలా సరదాగా సాగి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా పోస్టర్లో, ఇతర ప్రోమోల్లో సీనియర్ నటుడు, దర్శకుడు నారాయణమూర్తి బాగా హైలైట్ అవడం తెలిసిందే. ఆయన పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయారు. ఐతే ఓ సందర్భంలో పెళ్లి చేసుకోకుండా తప్పు చేశానని, పెళ్లి చేసుకోవడం ప్రకృతి ధర్మమని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మాటనే ట్రైలర్ చివర్లో చూపించడం, హీరో కంగుతినడం భలే ఫన్నీగా అనిపించింది.
ఐతే తమ సినిమా కోసం నారాయణ మూర్తిని ఇంతగా వాడుకుంటున్నపుడు ఆయన అనుమతి తీసుకోవడం అవసరం. ఆ పని తాము చేశామని.. ఈ కథ గురించి నారాయణమూర్తికి వివరించాకే సినిమా తీశామని తేజు తెలిపాడు. ఈ కథ విన్నవెంటనే ఆర్ నారాయణమూర్తిగారి అనుమతి తీసుకోవాలి అనిపించింది. ఐతే తేజు అప్పటికే సుబ్బు ఆయన అనుమతి తీసుకున్నట్లు చెప్పాడు. మూర్తి గారు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని మన ఇండస్ట్రీ కోసం మనం తప్పక నిలబడాలి.. తప్పకుండా సినిమా చేయండి అని చాలా సపోర్టివ్గా మాట్లాడారు. ఆయన్ని ఎప్పుడు కలిసిన సినిమా ఎలా వస్తోంది.. బాగా చేయండి అనేవారు. ఆయన సపోర్ట్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది అని తేజు చెప్పాడు.
సోలో బ్రతుకే సో బెటర్ కచ్చితంగా సూపర్ హిట్టయ్యే సినిమా అని.. ఈ సినిమాతో ఇండస్ట్రీలో మళ్లీ ఒక ఊపు వస్తుందని.. కుదిరితే తన ముగ్గురు మావయ్యలకు ఈ సినిమా స్పెషల్ షో వేయాలనుకుంటున్నామని తేజు వెల్లడించాడు.
This post was last modified on December 24, 2020 11:44 am
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…
మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…
తీన్మార్ మల్లన్న. నిత్యం మీడియాలో ఉంటూ..తనదైన శైలిలో గత కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింతపండు నవీన్ గురించి…
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…
ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్మనై 4 మీద కాస్తో కూస్తో…