టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కరోనా విరామం తర్వాత యమ జోరుమీదున్నారు. ఆయన ప్రొడక్షన్లో ప్రస్తుతం ఐదు సినిమాలు తెరకెక్కుతుండటం విశేషం. ఆ ఐదూ ఒకే రోజు షూటింగ్ జరుపుకోవడం గమనార్హం. బుధవారం రాజు సినిమాలు వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్నాయి.
అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ గురించి. పవన్తో సినిమా చేయాలన్నది రాజుకు ఎన్నో ఏళ్లుగా కల. ఎట్టకేలకు అది నెరవేరింది. కరోనా బ్రేక్ తర్వాత ఈ చిత్రం నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. పవన్ కూడా ఈ మధ్య రెగ్యులర్గా షూటింగ్లో పాల్గొంటున్నాడు. బుధవారం కూడా ఆయన సెట్స్లో ఉన్నాడు.
మరోవైపు ఇటీవలే అనౌన్స్ అయిన ఎఫ్-2 సీక్వెల్ ఎఫ్-3 సైతం బుధవారమే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకుంది. హీరో వెంకటేష్తో కలిసి దర్శకుడు ఆన్ లొకేషన్ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు కూడా. అలాగే ఇటీవలే నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ థ్యాంక్ యూ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాడు. అది కూడా రాజు సినిమానే.
ఇవి కాక రెండు చిన్న సినిమాలు రాజు లైన్లో పెట్టాడు. అందులో ఒకటి.. పాగల్. విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్తో కలిసి రాజు నిర్మిస్తున్నాడు. అలాగే హుషారు ఫేమ్ హర్ష దర్శకత్వంలోనూ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇలా రాజు నిర్మాణంలోని ఈ ఐదు సినిమాలూ ఒకే సమయంలో సెట్స్ మీద ఉన్నాయి. కరోనా కష్టకాలంలో ఓ నిర్మాత ఇలా ఐదు సినిమాలు ఒకేసారి ప్రొడ్యూస్ చేయడం చిన్న విషయం కాదు. అందుకే దిల్ రాజు అగ్రనిర్మాతగా కొనసాగుతున్నాడు.
This post was last modified on December 25, 2020 5:39 pm
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…