Movie News

దిల్ రాజు.. ఒకే రోజు ఐదు సినిమాల‌తో

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు క‌రోనా విరామం త‌ర్వాత య‌మ జోరుమీదున్నారు. ఆయ‌న ప్రొడ‌క్ష‌న్లో ప్ర‌స్తుతం ఐదు సినిమాలు తెర‌కెక్కుతుండ‌టం విశేషం. ఆ ఐదూ ఒకే రోజు షూటింగ్ జ‌రుపుకోవ‌డం గ‌మ‌నార్హం. బుధ‌వారం రాజు సినిమాలు వివిధ లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్నాయి.

అందులో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ మూవీ గురించి. ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌న్న‌ది రాజుకు ఎన్నో ఏళ్లుగా క‌ల‌. ఎట్ట‌కేల‌కు అది నెర‌వేరింది. క‌రోనా బ్రేక్ త‌ర్వాత ఈ చిత్రం నిర్విరామంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ప‌వ‌న్ కూడా ఈ మ‌ధ్య రెగ్యుల‌ర్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. బుధ‌వారం కూడా ఆయ‌న సెట్స్‌లో ఉన్నాడు.

మ‌రోవైపు ఇటీవ‌లే అనౌన్స్ అయిన ఎఫ్‌-2 సీక్వెల్ ఎఫ్‌-3 సైతం బుధ‌వార‌మే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టుకుంది. హీరో వెంక‌టేష్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు ఆన్ లొకేష‌న్ ఫొటో దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు కూడా. అలాగే ఇటీవ‌లే నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ థ్యాంక్ యూ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టాడు. అది కూడా రాజు సినిమానే.

ఇవి కాక రెండు చిన్న సినిమాలు రాజు లైన్లో పెట్టాడు. అందులో ఒక‌టి.. పాగ‌ల్. విశ్వ‌క్సేన్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్‌తో క‌లిసి రాజు నిర్మిస్తున్నాడు. అలాగే హుషారు ఫేమ్ హ‌ర్ష ద‌ర్శ‌క‌త్వంలోనూ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇలా రాజు నిర్మాణంలోని ఈ ఐదు సినిమాలూ ఒకే స‌మ‌యంలో సెట్స్ మీద ఉన్నాయి. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఓ నిర్మాత ఇలా ఐదు సినిమాలు ఒకేసారి ప్రొడ్యూస్ చేయ‌డం చిన్న విష‌యం కాదు. అందుకే దిల్ రాజు అగ్ర‌నిర్మాత‌గా కొన‌సాగుతున్నాడు.

Satya

Recent Posts

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

36 minutes ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

2 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

4 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

4 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

4 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

5 hours ago