భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంపై శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్న కవిత… ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కొత్తగా ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 25న ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లాకు ఉన్న పాత్రను, తెలంగాణ జాగృతి చేసిన పోరాటాన్ని గుర్తు చేసిన కవిత… రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యమని తాను ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. తెఅంగాణ ఆడబిడ్డలకు న్యాయం జరగాలన్నా, అణగారిన వర్గాలకు అందలం దక్కాలన్నా కొత్త రాజకీయ పార్టీ అవసరమని తాము భావిస్తున్నామన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఏవేవే చేస్తామని చెబుతున్న ప్రస్తుత రాజకీయ పార్టీలు అవసరం తీరాక వాటిని మరిచిపోతూ బడుగు వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 25 ఉదయం 10 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని చెప్పిన కవిత… అదే ముహూర్తానికి తన కొత్త పార్టీ పేరును ప్రకటిస్తామని చెప్పారు. ఈ ప్రకటనకు మేడ్చల్ జిల్లా పరిధిలోని మునీరాబాద్ వేదిక కానుందని ఆమె ప్రకటించారు. మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ లో జాగృతి కార్యకర్తల సమక్షంలో పార్టీ పేరును ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని కవిత చెప్పారు. పార్టీ పేరు ప్రకటన కార్యక్రమానికి జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
This post was last modified on March 27, 2026 3:44 pm
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితీ అంత బాగా లేదు. సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. జనాలు థియేటర్లకు…
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…
తమిళనాట రాజకీయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగజం…
బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…