Political News

కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంపై శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్న కవిత… ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కొత్తగా ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఏప్రిల్ 25న ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లాకు ఉన్న పాత్రను, తెలంగాణ జాగృతి చేసిన పోరాటాన్ని గుర్తు చేసిన కవిత… రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యమని తాను ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. తెఅంగాణ ఆడబిడ్డలకు న్యాయం జరగాలన్నా, అణగారిన వర్గాలకు అందలం దక్కాలన్నా కొత్త రాజకీయ పార్టీ అవసరమని తాము భావిస్తున్నామన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఏవేవే చేస్తామని చెబుతున్న ప్రస్తుత రాజకీయ పార్టీలు అవసరం తీరాక వాటిని మరిచిపోతూ బడుగు వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 25 ఉదయం 10 గంటల సమయంలో మంచి ముహూర్తం ఉందని చెప్పిన కవిత… అదే ముహూర్తానికి తన కొత్త పార్టీ పేరును ప్రకటిస్తామని చెప్పారు. ఈ ప్రకటనకు మేడ్చల్ జిల్లా పరిధిలోని మునీరాబాద్ వేదిక కానుందని ఆమె ప్రకటించారు. మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ లో జాగృతి కార్యకర్తల సమక్షంలో పార్టీ పేరును ప్రకటిస్తామని తెలిపారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని కవిత చెప్పారు. పార్టీ పేరు ప్రకటన కార్యక్రమానికి జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.

This post was last modified on March 27, 2026 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఉస్తాద్’ను ‘దురంధర్’ తో పోల్చిన హరీష్ శంకర్

‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్లో సినిమా అని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో ఎంతో ఎగ్జైట్ అయ్యారు పవర్ స్టార్ పవన్…

52 minutes ago

ప్రియదర్శి సినిమాకు ప్రచారం లేదేంటి

పెళ్లి చూపులు, జాతిరత్నాలు ఎంత పేరు తెచ్చినా ప్రియదర్శికి మంచి బ్రేక్ గా నిలిచింది బలగం సినిమానే. గత ఏడాది…

3 hours ago

భద్రాచల ఆలయానికి 1000 కోట్లు

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో.. గోదావ‌రి న‌ది ఒడ్డున ఉన్న ప్ర‌ఖ్యాత భ‌ద్రాచ‌లం ఆల‌యాన్ని విస్త‌రించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర…

3 hours ago

ర‌ఘురామ‌పై రాళ్ల దాడి… ఏం జ‌రిగింది?

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న తృటిలో…

3 hours ago

లాక్ డౌన్ భయాలకు కారణమెవరు?

కరోనా ప్రబలిన వేళ.. యావత్తు ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఎలాంటి విపత్కర సరిష్థితులను ఎదురు చూశామన్న…

4 hours ago

ఆళ్లగడ్డలో మళ్లీ లొల్లి… ఈ సారి ‘కేబుల్’ వార్

రాయలసీమలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి సాగిన ఫ్యాక్షన్ రాజకీయాలు…

5 hours ago