బాలీవుడ్ హీరోయిన్, చిరుత ఫేమ్ నేహా శర్మ సినిమాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, సోషల్ మీడియా ద్వారా సంపాదనలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇన్స్టాగ్రామ్లో తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలనుకునే వారి కోసం నెలకు 290 రూపాయల సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెట్టింది. ప్రస్తుతం ఆమెకు దాదాపు 2,454 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే సినిమాలు, వెబ్ సిరీస్లతో సంబంధం లేకుండా కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారానే ఆమె నెలకు సుమారు 7 లక్షల రూపాయలకు పైగా వెనకేస్తోంది.
ఒక నటిగా కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నా, డిజిటల్ ప్లాట్ఫామ్ను వాడుకుని ఇలా ఆదాయం పొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేహా శర్మ నేపథ్యం చూస్తే ఆమె బీహార్కు చెందిన కాంగ్రెస్ రాజకీయ నాయకుడు అజిత్ శర్మ కుమార్తె. ఇటీవల జరిగిన ఎన్నికల్లో (భాగల్పుర్ నియోజకవర్గం) తండ్రి ఓటమి పాలయ్యారు. బాలీవుడ్లో ఒకటి రెండు గుర్తింపు ఉన్న చిత్రాల్లో నటించినా అవేవీ ఆమె కెరీర్ను నిలబెట్టలేకపోయాయి.
ఆ తర్వాత ఓటీటీ వైపు అడుగులు వేసి ‘ఇల్లీగల్’ వంటి వెబ్ సిరీస్లలో నటించింది. అయితే ఒకటి కంటే ఎక్కువ సీజన్లు వచ్చినా ఆ సిరీస్లు ఆమెకు పెద్దగా బ్రేక్ ఇవ్వలేదు.
సినిమాలు ఫ్లాప్ అయినా గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వారికి ఆదాయ మార్గాలు మూసుకుపోవని నేహా శర్మ నిరూపిస్తోంది. సాధారణంగా సక్సెస్ ఉన్న హీరోయిన్లకు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, భారీ రెమ్యునరేషన్లు ఉంటాయి.
కానీ వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న ఒక నటి కూడా కేవలం సోషల్ మీడియా సబ్స్క్రిప్షన్లతో ఇంత మొత్తంలో సంపాదిస్తోందంటే, ఇక టాప్ హీరోయిన్ల రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో సక్సెస్ రేటు ఎలా ఉన్నా, ఫేమ్ ఉంటే చాలు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించవచ్చనేది అర్ధమవుతుంది. ఈ ఇన్స్టాగ్రామ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనేది కేవలం హీరోయిన్లకు, మహిళా సెలబ్రిటీలకే ఎక్కువగా వర్కవుట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హీరోలు లేదా మగ సెలబ్రిటీలు ఇలాంటి ప్లాన్లు పెట్టినా సబ్స్క్రైబర్లు వచ్చే అవకాశం తక్కువ. కేవలం గ్లామర్ కంటెంట్ను మాత్రమే నమ్ముకుని ఇలాంటి సబ్స్క్రిప్షన్ మోడల్స్ నడుస్తుంటాయి. నేహా శర్మ తన సినిమాల కంటే తన ఫొటో షూట్స్, జిమ్ వీడియోల ద్వారానే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇప్పుడు అదే క్రేజ్ను ఆదాయంగా మార్చుకుంటోంది.
This post was last modified on March 24, 2026 3:07 pm
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…