ఈ సమ్మర్ తెలుగు రిలీజుల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘డెకాయిట్’ ఒకటి. ఇది భారీ చిత్రమేమీ కాకపోయినా.. పెద్ద స్టార్లు లేకపోయినా.. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం అది అడివి శేష్ మూవీ కావడమే. ‘క్షణం’ దగ్గర్నుంచి తాను చేసే ప్రతి సినిమాలో బాగా ఇన్వాల్వ్ అవుతూ.. శేష్ సినిమా అంటే బలమైన కంటెంట్ ఉంటుంది అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడీ యంగ్ యాక్టర్ కమ్ రైటర్.
‘డెకాయిట్’ రైటింగ్లోనూ అతడికి భాగం ఉంది. రచన దగ్గర్నుంచి మేకింగ్ వరకు చాలా టైం తీసుకుని, జాగ్రత్తగా పని చేస్తుంది శేష్ అండ్ టీం. ‘గూఢచారి’ సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శేష్కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించడం ఈ సినిమాకు మరో ఆకర్షణ. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో సుప్రియ నిర్మించిన ఈ చిత్రం షూట్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 10కి రిలీజ్ అనుకుంటున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో శేష్.. ‘డెకాయిట్’ కథేంటో చెప్పేశాడు. ప్రేమలో పడి.. ఇగో క్లాష్ వల్ల విడిపోయిన జంట.. ఆపై ఒక క్రైసిస్లో భాగంగా కలిసినపుడు వారి మధ్య జరిగే సంఘటనల సమాహారమే ఈ సినిమా అని శేష్ చెప్పాడు. ఐతే ప్రేమకథ ఎక్కువ సేపు ఉండదని.. వాళ్లు ఎలా విడిపోయారు అన్నది ఐదు నిమిషాల్లో చూపిస్తామని చెప్పాడు.
వర్తమానంలో ఫుల్ యాక్షన్ మోడ్లో సినిమా నడుస్తుందని చెప్పాడు. తుపాకులు, బాంబుల మోత మధ్య ఒక క్రైసిస్ను ఎదుర్కొనే క్రమంలో ఈ జంట ఏం రియలైజ్ అయింది అన్న నేపథ్యంలో కథ నడుస్తుందని.. యాక్షన్, ఎమోషన్లు సినిమాలో హైలైట్గా ఉంటాయని శేష్ చెప్పాడు. ఈ సినిమాకు కథ రాయడానికి ఏడాది సమయం పట్టిందని.. షూట్ కోసం 150 దాకా వర్కింగ్ డేస్ అయ్యాయని శేష్ వెల్లడించాడు.
అయితే విడుదలకు ముందే ఇలా కథ మొత్తం చెప్పేస్తే స్క్రీన్ పై చూసినప్పుడు ఆసక్తి ఉండదేమో అంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కథ తెలిసిన అబ్బురపరిచే ట్విస్టులను దృష్టిలో పెట్టుకొనే శేష్ ఇలా చెప్పి ఉంటాడని ఇండస్ట్రీ వర్గాల చర్చ.
This post was last modified on March 12, 2026 3:29 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లే లక్ష్యంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. భారత…
తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…
ఇంకో అయిదు రోజుల్లో ధనుష్ కర విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రమోషన్ల…
వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లిన లావణ్య త్రిపాఠి.. తర్వాత సినిమాలకు దాదాపుగా దూరమైనట్లే కనిపించింది. ఐతే పెళ్లి…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం…
నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా…