మహేష్ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. ఇంకా అతని కొత్త సినిమా సెట్టెక్కలేదు. పరశురామ్తో ‘సర్కారు వారి పాట’ మహేష్ ఎప్పుడో ఓకే చేసేసుకున్నాడు. అయితే ఆ చిత్రానికి అడుగడుగునా ఆటంకాలెదురవుతున్నాయి. నవంబరులోనే మొదలు పెట్టాలని చూసిన షూటింగ్కి అవాంతరమొచ్చింది. విదేశాలలో షూటింగ్ కష్టమవుతుందని లోకల్గానే షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే జనవరిలో చేసే షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరప్ లేదా అమెరికా వెళ్లాలనే ఉద్దేశంతో వున్నారు.
కానీ ఇప్పుడు కొత్త కరోనా వచ్చి యుకె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడికి విమాన రాకపోకలు బంద్ చేసారు. దీంతో అది ఎప్పటికి ఒక దారికి వస్తుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. విదేశీ షూటింగ్ అయితే సర్కారు వారి పాటకు తప్పనిసరి అట. అయితే అది ఏ దేశంలో చేయాలో, ఎప్పుడు చేయాలో ఇప్పుడు నిర్మాతలు తేల్చుకోలేకపోతున్నారు.
ఈ సినిమా కంటే ముందుగా వేరే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అప్పట్లో మహేష్ చేసినా కానీ తర్వాత విరమించుకున్నాడు. సర్కారు వారి పాట కాస్త ఆలస్యంగా మొదలయినా కానీ దసరా టైమ్కి వస్తుందని ఫాన్స్ ఆశ పడుతున్నారు. ఒకవేళ షూటింగ్లో మరింత జాప్యం ఎదురయితే కనుక విడుదల తేదీ కూడా ఇంకా వెనక్కు వెళ్లవచ్చు.
This post was last modified on December 22, 2020 4:02 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…