మహేష్ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. ఇంకా అతని కొత్త సినిమా సెట్టెక్కలేదు. పరశురామ్తో ‘సర్కారు వారి పాట’ మహేష్ ఎప్పుడో ఓకే చేసేసుకున్నాడు. అయితే ఆ చిత్రానికి అడుగడుగునా ఆటంకాలెదురవుతున్నాయి. నవంబరులోనే మొదలు పెట్టాలని చూసిన షూటింగ్కి అవాంతరమొచ్చింది. విదేశాలలో షూటింగ్ కష్టమవుతుందని లోకల్గానే షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే జనవరిలో చేసే షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరప్ లేదా అమెరికా వెళ్లాలనే ఉద్దేశంతో వున్నారు.
కానీ ఇప్పుడు కొత్త కరోనా వచ్చి యుకె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడికి విమాన రాకపోకలు బంద్ చేసారు. దీంతో అది ఎప్పటికి ఒక దారికి వస్తుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. విదేశీ షూటింగ్ అయితే సర్కారు వారి పాటకు తప్పనిసరి అట. అయితే అది ఏ దేశంలో చేయాలో, ఎప్పుడు చేయాలో ఇప్పుడు నిర్మాతలు తేల్చుకోలేకపోతున్నారు.
ఈ సినిమా కంటే ముందుగా వేరే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అప్పట్లో మహేష్ చేసినా కానీ తర్వాత విరమించుకున్నాడు. సర్కారు వారి పాట కాస్త ఆలస్యంగా మొదలయినా కానీ దసరా టైమ్కి వస్తుందని ఫాన్స్ ఆశ పడుతున్నారు. ఒకవేళ షూటింగ్లో మరింత జాప్యం ఎదురయితే కనుక విడుదల తేదీ కూడా ఇంకా వెనక్కు వెళ్లవచ్చు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…
నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…