మహేష్ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. ఇంకా అతని కొత్త సినిమా సెట్టెక్కలేదు. పరశురామ్తో ‘సర్కారు వారి పాట’ మహేష్ ఎప్పుడో ఓకే చేసేసుకున్నాడు. అయితే ఆ చిత్రానికి అడుగడుగునా ఆటంకాలెదురవుతున్నాయి. నవంబరులోనే మొదలు పెట్టాలని చూసిన షూటింగ్కి అవాంతరమొచ్చింది. విదేశాలలో షూటింగ్ కష్టమవుతుందని లోకల్గానే షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే జనవరిలో చేసే షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరప్ లేదా అమెరికా వెళ్లాలనే ఉద్దేశంతో వున్నారు.
కానీ ఇప్పుడు కొత్త కరోనా వచ్చి యుకె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడికి విమాన రాకపోకలు బంద్ చేసారు. దీంతో అది ఎప్పటికి ఒక దారికి వస్తుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. విదేశీ షూటింగ్ అయితే సర్కారు వారి పాటకు తప్పనిసరి అట. అయితే అది ఏ దేశంలో చేయాలో, ఎప్పుడు చేయాలో ఇప్పుడు నిర్మాతలు తేల్చుకోలేకపోతున్నారు.
ఈ సినిమా కంటే ముందుగా వేరే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అప్పట్లో మహేష్ చేసినా కానీ తర్వాత విరమించుకున్నాడు. సర్కారు వారి పాట కాస్త ఆలస్యంగా మొదలయినా కానీ దసరా టైమ్కి వస్తుందని ఫాన్స్ ఆశ పడుతున్నారు. ఒకవేళ షూటింగ్లో మరింత జాప్యం ఎదురయితే కనుక విడుదల తేదీ కూడా ఇంకా వెనక్కు వెళ్లవచ్చు.
This post was last modified on December 22, 2020 4:02 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…