టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ క్రమంగా వేగం పుంజుకుంటోంది. యుద్ధ వాతావరణం వల్ల ఇటీవలి జోర్దాన్ షెడ్యూల్ ని అనుకున్న టైం కన్నా ముందే పూర్తి చేసుకుని వచ్చిన టీమ్ బాలన్స్ పోర్షన్ ని హైదరాబాద్ లో సెట్స్ వేసి తీస్తున్నారు. జూన్ లేదా జూలైలో విడుదల కావడం సాధ్యం కాదు కాబట్టి ఆ మేరకు త్వరలోనే వాయిదా ప్రకటన రావొచ్చు.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ – నీల్ ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా తెలివైన ఎత్తుగడతో వెళ్తున్నారని సమాచారం. అంటే సీక్వెల్ కు సంబంధించిన కొన్ని భాగాలు ఇప్పుడే తీస్తున్నారట. వ్యయాన్ని తగ్గించడం కోసం, తారక్ డేట్లు వృథా కాకుండా ఇలా ప్లాన్ చేస్తున్నారన్న మాట. ఇంకా చెప్పాలంటే దురంధర్ తరహాలో టూ పార్ట్స్ మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా సరైన ప్రణాళికతో చేస్తున్న చక్కని స్ట్రాటజీ ఇది. మొదటి భాగం రిలీజయిన వెంటనే సీక్వెల్ మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తారు.
పుష్ప, బాహుబలి, కాంతార, కెజిఎఫ్ ఈ మార్గాన్ని పాటించలేదు. అందుకే రెండు భాగాల మధ్య రెండు నుంచి మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆదిత్య దార్ అలా జరగకూడదనే దురంధర్ కి కేవలం మూడు నెలల స్పేస్ పెట్టుకుని అదే మాట మీద నిలబడ్డాడు. వాయిదా పడుతుందనే పుకార్లను తట్టుకుని చెప్పిన డేట్ కె దురంధర్ రివెంజ్ రావడం వెనుక, టాక్సిక్ వెనుకడుగు చేయడం వెనుక ఆదిత్య ధార్ అద్భుతమైన ప్లానింగ్ తప్ప మరొకటి కాదు.
ఎన్టీఆర్ – నీల్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. పలు ఆప్షన్లు చూస్తున్నారట. సలార్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఆయన మీద అంచనాలు మాములుగా లేవు. ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఒక హిస్టారికల్ మాఫియా డ్రామాని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నట్టు యూనిట్ టాక్. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న డ్రాగన్ లో తారక్ పాత్ర ఊహించని విధంగా రెండు మూడు షేడ్స్ లో ఉంటుందట.
This post was last modified on March 10, 2026 11:16 am
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…