Movie News

తెలివైన స్ట్రాటజీతో ఎన్టీఆర్ & నీల్

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ క్రమంగా వేగం పుంజుకుంటోంది. యుద్ధ వాతావరణం వల్ల ఇటీవలి జోర్దాన్ షెడ్యూల్ ని అనుకున్న టైం కన్నా ముందే పూర్తి చేసుకుని వచ్చిన టీమ్ బాలన్స్ పోర్షన్ ని హైదరాబాద్ లో సెట్స్ వేసి తీస్తున్నారు. జూన్ లేదా జూలైలో విడుదల కావడం సాధ్యం కాదు కాబట్టి ఆ మేరకు త్వరలోనే వాయిదా ప్రకటన రావొచ్చు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ – నీల్ ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా తెలివైన ఎత్తుగడతో వెళ్తున్నారని సమాచారం. అంటే సీక్వెల్ కు సంబంధించిన కొన్ని భాగాలు ఇప్పుడే తీస్తున్నారట. వ్యయాన్ని తగ్గించడం కోసం, తారక్ డేట్లు వృథా కాకుండా ఇలా ప్లాన్ చేస్తున్నారన్న మాట. ఇంకా చెప్పాలంటే దురంధర్ తరహాలో టూ పార్ట్స్ మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా సరైన ప్రణాళికతో చేస్తున్న చక్కని స్ట్రాటజీ ఇది. మొదటి భాగం రిలీజయిన వెంటనే సీక్వెల్ మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తారు.

పుష్ప, బాహుబలి, కాంతార, కెజిఎఫ్ ఈ మార్గాన్ని పాటించలేదు. అందుకే రెండు భాగాల మధ్య రెండు నుంచి మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆదిత్య దార్ అలా జరగకూడదనే దురంధర్ కి కేవలం మూడు నెలల స్పేస్ పెట్టుకుని అదే మాట మీద నిలబడ్డాడు. వాయిదా పడుతుందనే పుకార్లను తట్టుకుని చెప్పిన డేట్ కె దురంధర్ రివెంజ్ రావడం వెనుక, టాక్సిక్ వెనుకడుగు చేయడం వెనుక ఆదిత్య ధార్ అద్భుతమైన ప్లానింగ్ తప్ప మరొకటి కాదు.

ఎన్టీఆర్ – నీల్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. పలు ఆప్షన్లు చూస్తున్నారట. సలార్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఆయన మీద అంచనాలు మాములుగా లేవు. ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఒక హిస్టారికల్ మాఫియా డ్రామాని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నట్టు యూనిట్ టాక్. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న డ్రాగన్ లో తారక్ పాత్ర ఊహించని విధంగా రెండు మూడు షేడ్స్ లో ఉంటుందట.

Kumar

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

55 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

2 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

2 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

3 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

3 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago