కేజీఎఫ్-చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా జూనియర్ ఎన్టీఆర్తో ఉంటుందనే అంతా అనుకున్నారు. వీళ్లిద్దరి కలయికలో సినిమా చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేయడం తెలిసిన సంగతి తెలిసిందే. దీని గురించి చాలా రోజుల కిందటే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన కూడా చేసింది. ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్తో కలిసి సినిమా చేయడం గురించి చాలా ఎగ్జైట్ అవుతూ ట్వీట్ పెట్టాడు.
కానీ అంతటితో ఆ వ్యవహారం ముగిసిపోయింది. అనూహ్యంగా ప్రభాస్ సినిమాను ముందుకు తెచ్చాడు ప్రశాంత్. కేజీఎఫ్ నిర్మాతలు వీళ్లిద్దరి కలయికలో సలార్ అనే సినిమాను ప్రకటించారు. అది జనవరిలోనే సెట్స్ మీదికి కూడా వెళ్లబోతోందంటున్నారు. 2021లోనే రిలీజ్ అని కూడా సంకేతాలు అందుతున్నాయి.
దీంతో ఎన్టీఆర్తో ప్రశాత్ సినిమా సంగతేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సినిమా ముందుకొచ్చినంత మాత్రాన ఎన్టీఆర్తో సినిమా క్యాన్సిల్ అయిందని అనుకోవడానికి లేదు. కానీ ఆ సినిమా ఉంటుందనే సంకేతాలు ఎవరి నుంచీ రావట్లేదు. సలార్ అనౌన్స్మెంట్ నేపథ్యంలో తమ హీరోతో ప్రశాంత్ సినిమా గురించి టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ అభిమానులను ఊరడించే ప్రయత్నం ఏమీ జరగట్లేదు.
సలార్ తర్వాత అయినా ప్రశాంత్, ఎన్టీఆర్ సినిమా ఉంటుందని మైత్రీ వాళ్ల నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. కన్నడ స్టార్లను విడిచిపెట్టి ప్రభాస్తో సినిమా చేయడం గురించి ట్రోల్ చేస్తున్న కన్నడ అభిమానులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన ప్రశాంత్.. తనను ట్యాగ్ చేసి ఎన్టీఆర్ సినిమా గురించి అడుగుతున్న అతడి అభిమానులకు మాత్రం ఏమీ సమాధానం ఇవ్వడం లేదు. ఎన్టీఆర్ అయితే దీని గురించి స్పందించే స్థితిలో లేడు. తమను టెన్షన్ పెట్టకుండా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందంలోంచి ఎవరో ఒకరు ఏదో రకంగా ఒకరు అప్ డేట్ ఇస్తే బాగుండన్నది తారక్ అభిమానుల కోరిక.
This post was last modified on December 22, 2020 12:52 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…