ఇప్పుడు తెలుగు సంగీత దర్శకుల్లో తమనే నంబర్ వన్ అనడంలో ఎంలాంటి సందేహం లేదు. అతడి గత సినిమాలకు సంగీత పరంగా వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చేతిలో క్రేజీ ప్రాజెక్టులు పెట్టుకుని మళ్లీ తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.
మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాతో పాటు పవన్ కొత్త సినిమాలు రెండింటికీ అతనే సంగీత దర్శకుడు. ఇప్పటికే వకీల్ సాబ్ అతను సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి వచ్చిన తొలి పాట అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో అతడి ముద్ర ఎలా ఉంటుందో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరోవైపు సితార బేనర్లో పవన్ చేయనున్న అయ్యప్పనుం కోషీయుం రీమేక్కు సైతం తమనే సంగీత దర్శకుడిగా ఖరారయ్యాడు.
ఐతే ఈ రెండు సినిమాల్లో సంగీత పరంగా పవన్ అభిమానుల్ని ఎక్కువ ఎగ్జైట్ చేస్తున్నది అయ్యప్పనుం కోషీయుం రీమేకే. వకీల్ సాబ్ ప్రధానంగా మహిళల సమస్యల చుట్టూ తిరిగే సినిమా. కథాంశం ప్రకారం చూస్తే అందులో మాస్ మూమెంట్స్ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ పవన్ చేయబోయే కొత్త చిత్రం వేరు. అందులో పవన్ పాత్రకు ఎలివేషన్ ఓ రేంజిలో ఉంటుంది. మాతృకను మించి పవన్ కోసం ఆ పాత్రను మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దే అవకాశముంది. ఒరిజినల్లో ఆ పాత్రతో ముడిపడ్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ అయింది.
తమన్ దాన్ని మించిన బీజీఎం ఇవ్వబోతున్నాడని ఈ సినిమాకు సంబంధించి తాజా అనౌన్స్ మెంట్ వీడియోలో స్కోర్ వింటే అర్థమవుతుంది. రొటీన్ టెంప్లేట్ స్కోర్లను పక్కన పెట్టి తన శైలికి భిన్నమైన బీజీఎం ఇచ్చాడు ఇందులో తమన్. అది వింటుంటే పవన్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అనౌన్స్ మెంట్ వీడియోకే ఇలా ఉంటే.. ఇక సినిమాలో తమన్ బీజీఎం ఎలా మోత మోగించేస్తుందో అని పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకుంటున్నారు.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…