ఇప్పుడు తెలుగు సంగీత దర్శకుల్లో తమనే నంబర్ వన్ అనడంలో ఎంలాంటి సందేహం లేదు. అతడి గత సినిమాలకు సంగీత పరంగా వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు చేతిలో క్రేజీ ప్రాజెక్టులు పెట్టుకుని మళ్లీ తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.
మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాతో పాటు పవన్ కొత్త సినిమాలు రెండింటికీ అతనే సంగీత దర్శకుడు. ఇప్పటికే వకీల్ సాబ్ అతను సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి వచ్చిన తొలి పాట అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో అతడి ముద్ర ఎలా ఉంటుందో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరోవైపు సితార బేనర్లో పవన్ చేయనున్న అయ్యప్పనుం కోషీయుం రీమేక్కు సైతం తమనే సంగీత దర్శకుడిగా ఖరారయ్యాడు.
ఐతే ఈ రెండు సినిమాల్లో సంగీత పరంగా పవన్ అభిమానుల్ని ఎక్కువ ఎగ్జైట్ చేస్తున్నది అయ్యప్పనుం కోషీయుం రీమేకే. వకీల్ సాబ్ ప్రధానంగా మహిళల సమస్యల చుట్టూ తిరిగే సినిమా. కథాంశం ప్రకారం చూస్తే అందులో మాస్ మూమెంట్స్ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ పవన్ చేయబోయే కొత్త చిత్రం వేరు. అందులో పవన్ పాత్రకు ఎలివేషన్ ఓ రేంజిలో ఉంటుంది. మాతృకను మించి పవన్ కోసం ఆ పాత్రను మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దే అవకాశముంది. ఒరిజినల్లో ఆ పాత్రతో ముడిపడ్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ అయింది.
తమన్ దాన్ని మించిన బీజీఎం ఇవ్వబోతున్నాడని ఈ సినిమాకు సంబంధించి తాజా అనౌన్స్ మెంట్ వీడియోలో స్కోర్ వింటే అర్థమవుతుంది. రొటీన్ టెంప్లేట్ స్కోర్లను పక్కన పెట్టి తన శైలికి భిన్నమైన బీజీఎం ఇచ్చాడు ఇందులో తమన్. అది వింటుంటే పవన్ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అనౌన్స్ మెంట్ వీడియోకే ఇలా ఉంటే.. ఇక సినిమాలో తమన్ బీజీఎం ఎలా మోత మోగించేస్తుందో అని పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకుంటున్నారు.
This post was last modified on December 22, 2020 12:49 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…