తమిళనాట శరవణ స్టోర్స్ సహా పలు వ్యాపారాలతో వేల కోట్ల స్థాయికి ఎదిగిన వ్యక్తి శరవణన్. తన పేరుకు ముందు తనే పెట్టుకున్న ‘లెజెండ్’ అనే టైటిల్తోనే అతను హీరోగా అరంగేట్రం చేశాడు. దాని మీద భారీ బడ్జెట్ కూడా పెట్టాడు. రోబోలా ఉండే తన అవతారం.. పేలవమైన నటన.. విపరీతమైన బిల్డప్పులతో సాగిన సన్నివేశాలు.. ‘లెజెండ్’ను ఒక ట్రోల్ మెటీరియల్గా మార్చేశాయి. ఇప్పటికీ ఆ సినిమా మీమ్ టెంప్లేట్స్ సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి.
‘లెజెండ్’ సినిమా రిలీజయ్యాక మూడేళ్ల పాటు శరవణన్ మళ్లీ ఇంకో మూవీ చేయలేదు. దీంతో ఇక అతను మళ్లీ కెమెరా ముందుకు ముందుకు రాడేమో అనుకున్నారు. కానీ శరవణన్ గత ఏడాది కొత్త సినిమాకు రెడీ అయ్యాడు. ధనుష్తో ‘కోడి’ లాంటి హిట్ మూవీ తీసిన దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ‘లీడర్’ అనే సినిమాలో నటించాడు. ఇంతకుముందే దీని గ్లింప్స్ రిలీజైంది. తాజాగా తమిళ, తెలుగు భాషల్లో ‘లీడర్’ టీజర్ లాంచ్ చేశారు.
ఈ టీజర్ చూస్తే.. శరవణన్ ఈసారి ట్రోల్స్ బారిన పడే కామెడీ మూవీ తీయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అతను తన లుక్ మార్చుకోవడమే కాదు.. కంటెంట్ మీద కూడా బాగానే దృష్టిపెట్టినట్లున్నాడు. పేరున్న దర్శకుడైన దురై.. హీరో ఎవరన్నది చూడకుండా తన స్టయిల్లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ తీసినట్లున్నాడు. ప్రమాదంలో పడ్డ తన కూతురిని కాపాడుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్లే హీరో కథ ఇది.
ఇందులో శరవణన్.. శక్తివేల్ అనే పాత్రలో కనిపించనున్నాడు. అతడికి జోడీగా టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించింది. ఆమెకు తోడు ఆండ్రియా, కిక్ శ్యామ్, లాల్.. ఇలా పెద్ద కాస్టింగే పెట్టుకున్నారు. దేశవిదేశాల్లో భారీ ఖర్చు పెట్టి సినిమా తీశారు. యాక్షన్ ఘట్టాలు స్టార్ హీరోల సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఉన్నాయి. ఈసారి ఖర్చునే కాక కంటెంట్ను నమ్ముకుని వస్తున్నట్లున్నాడు శరవణన్. ఏప్రిల్లో ‘లీడర్’ రిలీజ్ కాబోతోంది. మరి హీరోగా వెలిగిపోవాలన్న అతడి కోరిక ఈసారైనా నెరవేరుతుందేమో చూడాలి.
This post was last modified on March 5, 2026 10:04 pm
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…