మార్చి 19 దురంధర్ రివెంజ్ తో నువ్వా నేనానే రీతిలో పోటీ పడుతున్న టాక్సిక్ నుంచి ఇవాళ ఫస్ట్ సింగల్ వచ్చింది. మాములుగా లిరికల్ వీడియో అంటే విజువల్స్, మేకింగ్ షాట్స్ ఉంటాయి. కానీ అవేవి లేకుండా కేవలం కియారా అద్వానీ, యష్ సముద్రం ఒడ్డున కూచున్న ఒక స్టిల్ పెట్టేసి మమ అనిపించారు. విశాల్ మిశ్రా ట్యూన్ చేసిన ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కు రామజోగయ్య శాస్త్రి సంగీతం సమకూర్చారు.
తబాహి అంటూ హిందీ పదాన్నే హుక్ వర్డ్ గా పెట్టుకుని మిగిలింది ఆయా భాషలకు అనుగుణంగా సాహిత్యం రాయించారు. మెల్లగా ఎక్కేలా ఉన్నా ఈ పాటలో రిథమ్స్, విశాల్ గాత్రం బాగానే ఉన్నాయి. విడుదల కేవలం పదిహేడు రోజుల దూరంలో పెట్టుకుని ఇలా కంటెంట్ దాచడం పట్ల ఫాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ అయితే ఈ పాట తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తవ్వలేదు. కానీ మ్యూజిక్ కంపెనీ ఒత్తిడి వల్ల కొంచెం హడావిడిగా విడుదల చేయాల్సి వచ్చిందట.
లేదంటే నెక్స్ట్ లెవెల్ లో ఉన్న ఈ సాంగ్ టేకింగ్ చూసి సోషల్ మీడియా షేక్ అయ్యేదని అంటున్నారు. ఆ రేంజ్ లో యష్, కియారా రొమాన్స్ పండిందట. అధికారికంగా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ సోర్స్ అయితే అదే అంటోంది. మొత్తం నాలుగు పాటలు ఉన్న టాక్సిక్ నుంచి తక్కువ గ్యాప్ లోనే అన్ని రాబోతున్నాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే సినిమా నిండా హీరోయిన్లు ఉన్నా వాళ్ళను ఎక్కువ బయట పెట్టకుండా మేనేజ్ చేస్తున్నారు.
రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషి తదితరులను కేవలం పోస్టర్ల ద్వారా మాత్రమే పరిచయం చేశారు. టీజర్ లో కూడా కనిపించలేదు. సెన్సార్ కోసం రెడీ అవుతున్న టాక్సిక్ పనుల్లో దర్శకురాలు గీతూ మోహన్ దాస్, హీరో యష్ ఇద్దరూ బిజీగా ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో కలిపి భారీ రిలీజ్ కు కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది. మంచి డిస్ట్రిబ్యూటర్లు దొరకడంతో దురంధర్ ది రివెంజ్ కు పోటీ ఇవ్వడం ఖాయమే. పాజిటివ్ టాక్ వస్తే కెజిఎఫ్ రికార్డులే టార్గెట్ అవుతాయి.
This post was last modified on March 2, 2026 5:05 pm
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…
నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…