మెగాస్టార్ చిరంజీవి మామూలు స్పీడులో లేడిప్పుడు. కరోనా విరామం తర్వాత ‘ఆచార్య’ సినిమాలో చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన.. త్వరలోనే దాని కథ ముగించనున్నారు. ఇటీవలే ఆయన ‘లూసిఫర్’ రీమేక్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని.. ఫిబ్రవరిలో దీని షూటింగ్ మొదలవుతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దాని తర్వాత చిరు చేసే సినిమా విషయంలో సంకేతాలు ఉన్నాయి కానీ.. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ‘బిగ్ బాస్’ ఫైనల్ సందర్భంగా చిరు స్వయంగా ఆ ప్రాజెక్టు గురించి స్పష్టత ఇచ్చాడు. ‘లూసిఫర్’ రీమేక్ తర్వాత కూడా తాను చేయబోయేది రీమేకే అని.. అది తమిళం హిట్ ‘వేదాలం’ ఆధారంగా తెరకెక్కనుందని చిరు చెప్పాడు. అలాగే ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడని కూడా ఖరారు చేశాడు.
‘బిగ్ బాస్-4’లో పాల్గొన్న కంటెస్టెంట్లందరూ ఫైనల్ వేడుకకు హాజరు కాగా.. అందులో ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ దివి దగ్గరికొచ్చేసరికి రొమాంటిక్ టోన్లోకి వెళ్లిపోయారు. ఆ అమ్మాయి తనకెంతో నచ్చిందని.. ఆ ఇంప్రెషన్తోనే ‘వేదాలం’ రీమేక్లో తనకు ఓ పాత్ర ఇస్తే బాగుంటుందని దర్శకుడు మెహర్ రమేష్కు చెప్పానని.. అతను ఆమెకు ఒక పోలీస్ క్యారెక్టర్ కన్ఫమ్ చేశాడని చిరు వెల్లడించాడు. ఈ పాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూడమని కూడా తాను చెప్పినట్లు చిరు పేర్కొనడం విశేషం.
ఏడెనిమిది నెలల తర్వాత తాను, దివి కలిసి నటించబోతున్నట్లు ఆయన ఖరారు చేశాడు. మరోవైపు సోహైల్కు సైతం ఒక కమిట్మెంట్ ఇచ్చాడు చిరు. తాను ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపుతో ఒక సినిమా తీయాలని నిర్ణయించుకున్నానని.. ఆ సినిమా ఆడియో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్కు వచ్చిన తనను ఆశీర్వదించాలని సోహైల్ కోరగా.. ఆ ఈవెంట్ తన చేతుల మీదుగా జరిపిస్తానని అన్నాడు చిరు. అంతటితో ఆగకుండా ఆ సినిమాలో ఒక క్యామియో చేసే అవకాశం ఇవ్వాలని అన్నాడు చిరు. సోహైల్ అంతకంటే నాకేం కావాలి సార్ అంటే.. కోట్ల మంది ముందు హామీ ఇస్తున్నా, నువ్వు సినిమా తీస్తే అందులో క్యామియో చేస్తా అని చిరు అని నొక్కి వక్కాణించడం విశేషం.
This post was last modified on December 21, 2020 1:26 pm
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…