మెగాస్టార్ చిరంజీవి మామూలు స్పీడులో లేడిప్పుడు. కరోనా విరామం తర్వాత ‘ఆచార్య’ సినిమాలో చిత్రీకరణలో పాల్గొంటున్న ఆయన.. త్వరలోనే దాని కథ ముగించనున్నారు. ఇటీవలే ఆయన ‘లూసిఫర్’ రీమేక్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని.. ఫిబ్రవరిలో దీని షూటింగ్ మొదలవుతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దాని తర్వాత చిరు చేసే సినిమా విషయంలో సంకేతాలు ఉన్నాయి కానీ.. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ‘బిగ్ బాస్’ ఫైనల్ సందర్భంగా చిరు స్వయంగా ఆ ప్రాజెక్టు గురించి స్పష్టత ఇచ్చాడు. ‘లూసిఫర్’ రీమేక్ తర్వాత కూడా తాను చేయబోయేది రీమేకే అని.. అది తమిళం హిట్ ‘వేదాలం’ ఆధారంగా తెరకెక్కనుందని చిరు చెప్పాడు. అలాగే ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడని కూడా ఖరారు చేశాడు.
‘బిగ్ బాస్-4’లో పాల్గొన్న కంటెస్టెంట్లందరూ ఫైనల్ వేడుకకు హాజరు కాగా.. అందులో ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ దివి దగ్గరికొచ్చేసరికి రొమాంటిక్ టోన్లోకి వెళ్లిపోయారు. ఆ అమ్మాయి తనకెంతో నచ్చిందని.. ఆ ఇంప్రెషన్తోనే ‘వేదాలం’ రీమేక్లో తనకు ఓ పాత్ర ఇస్తే బాగుంటుందని దర్శకుడు మెహర్ రమేష్కు చెప్పానని.. అతను ఆమెకు ఒక పోలీస్ క్యారెక్టర్ కన్ఫమ్ చేశాడని చిరు వెల్లడించాడు. ఈ పాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూడమని కూడా తాను చెప్పినట్లు చిరు పేర్కొనడం విశేషం.
ఏడెనిమిది నెలల తర్వాత తాను, దివి కలిసి నటించబోతున్నట్లు ఆయన ఖరారు చేశాడు. మరోవైపు సోహైల్కు సైతం ఒక కమిట్మెంట్ ఇచ్చాడు చిరు. తాను ‘బిగ్ బాస్’తో వచ్చిన గుర్తింపుతో ఒక సినిమా తీయాలని నిర్ణయించుకున్నానని.. ఆ సినిమా ఆడియో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్కు వచ్చిన తనను ఆశీర్వదించాలని సోహైల్ కోరగా.. ఆ ఈవెంట్ తన చేతుల మీదుగా జరిపిస్తానని అన్నాడు చిరు. అంతటితో ఆగకుండా ఆ సినిమాలో ఒక క్యామియో చేసే అవకాశం ఇవ్వాలని అన్నాడు చిరు. సోహైల్ అంతకంటే నాకేం కావాలి సార్ అంటే.. కోట్ల మంది ముందు హామీ ఇస్తున్నా, నువ్వు సినిమా తీస్తే అందులో క్యామియో చేస్తా అని చిరు అని నొక్కి వక్కాణించడం విశేషం.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…