తాజాగా విష్ణు విన్యాసంతో బాక్సాఫీస్ ని పలకరించిన శ్రీవిష్ణు మరో కొత్త సినిమా మృత్యుంజయ్ కేవలం వారం గ్యాప్ లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. మార్చి 6 విడుదల కాబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కి శ్రీ హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా కాల భైరవ సంగీతం సమకూర్చారు.
తాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఫన్ స్కూలుకి భిన్నంగా శ్రీవిష్ణు ఈసారి సీరియస్ జానర్ వైపు షిఫ్ట్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఎక్స్ లో లాంచ్ అయిన ఈ ట్రైలర్లో కథ ఏంటో ఎక్కువ దాచకుండా చెప్పేశారు. అయితే అసలైన సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ చేయకుండా ఆసక్తి పెంచారు. స్టోరీ ఇంటరెస్టింగ్ గానే ఉంది.
జై (శ్రీవిష్ణు) ఎలాంటి రిస్కు అయినా ఈజీగా తీసుకునే రకం. అర్హత లేకపోయినా ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ లో చేరాలన్నది తన లక్ష్యం. దీని కోసం ఎన్నో నేరాల్లో హంతుకులను పట్టుకోవడం కోసం మరువేషాలు వేసి, ప్రాణాలకు తెగించి మరీ అధికారులకు సహాయం చేస్తాడు.
ఈ క్రమంలో ఒక మంచి వ్యక్తి చనిపోతాడు. అతని కూతురికి జవాబు చెప్పే బాధ్యత జై మీద పడుతుంది. అతికించబడిన కాలు తప్ప హత్య చేసిన వాడి గురించి ఇంకే ఆధారాలు లేకుండా జై వేట మొదలుపెడతాడు. ఒక దశలో ఓడిపోతానా అనే భయం కూడా కలుగుతుంది. కానీ పట్టువదలకుండా గమ్యం చేరుకుని మృత్యుంజయ్ అనిపించుకుంటాడు.
విజువల్స్ చూస్తుంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ కలుగుతోంది. ఆచూకీ లేని హంతకుడిని పట్టుకునే కథలు కొత్తేమి కాదు కానీ హుసేన్ షా కిరణ్ రాసుకున్న ట్రీట్ మెంట్ కొంత వైవిధ్యంగా ఉంది. హీరోయిన్ రెబ్బా జాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం.
కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ కంటెంట్ ని ఎలివేట్ చేయగా అనుభవజ్ఞులైన టెక్నికల్ టీమ్ మంచి క్వాలిటీని తీసుకురావడంలో దోహదపడింది. జనవరిలో సంక్రాంతి హడావుడి తర్వాత సరైన సీరియస్ మూవీ ఏదీ రాలేదు. మృత్యుంజయ్ ఆ లోటు తీర్చేలా ఉంది. ఆడియన్స్ ని కనక మెప్పించగలిగితే శ్రీవిష్ణు కొత్త జానర్ లో సూపర్ హిట్ దక్కినట్టు ఉంటుంది. చూడాలి.
This post was last modified on February 28, 2026 11:50 am
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…
నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…
ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం విషయంలో అభిమానులు ఎంత మాత్రం హ్యాపీగా లేరన్నది వాస్తవం. వింటేజ్ పవన్…
ఓ ముప్పై ఏళ్ళు వెనక్కు వెళ్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ల ప్రభంజనం ఉదృతంగా ఉన్న టైంలో తెలుగు భాష…