తాజాగా విష్ణు విన్యాసంతో బాక్సాఫీస్ ని పలకరించిన శ్రీవిష్ణు మరో కొత్త సినిమా మృత్యుంజయ్ కేవలం వారం గ్యాప్ లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. మార్చి 6 విడుదల కాబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కి శ్రీ హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా కాల భైరవ సంగీతం సమకూర్చారు.
తాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఫన్ స్కూలుకి భిన్నంగా శ్రీవిష్ణు ఈసారి సీరియస్ జానర్ వైపు షిఫ్ట్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఎక్స్ లో లాంచ్ అయిన ఈ ట్రైలర్లో కథ ఏంటో ఎక్కువ దాచకుండా చెప్పేశారు. అయితే అసలైన సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ చేయకుండా ఆసక్తి పెంచారు. స్టోరీ ఇంటరెస్టింగ్ గానే ఉంది.
జై (శ్రీవిష్ణు) ఎలాంటి రిస్కు అయినా ఈజీగా తీసుకునే రకం. అర్హత లేకపోయినా ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ లో చేరాలన్నది తన లక్ష్యం. దీని కోసం ఎన్నో నేరాల్లో హంతుకులను పట్టుకోవడం కోసం మరువేషాలు వేసి, ప్రాణాలకు తెగించి మరీ అధికారులకు సహాయం చేస్తాడు.
ఈ క్రమంలో ఒక మంచి వ్యక్తి చనిపోతాడు. అతని కూతురికి జవాబు చెప్పే బాధ్యత జై మీద పడుతుంది. అతికించబడిన కాలు తప్ప హత్య చేసిన వాడి గురించి ఇంకే ఆధారాలు లేకుండా జై వేట మొదలుపెడతాడు. ఒక దశలో ఓడిపోతానా అనే భయం కూడా కలుగుతుంది. కానీ పట్టువదలకుండా గమ్యం చేరుకుని మృత్యుంజయ్ అనిపించుకుంటాడు.
విజువల్స్ చూస్తుంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ కలుగుతోంది. ఆచూకీ లేని హంతకుడిని పట్టుకునే కథలు కొత్తేమి కాదు కానీ హుసేన్ షా కిరణ్ రాసుకున్న ట్రీట్ మెంట్ కొంత వైవిధ్యంగా ఉంది. హీరోయిన్ రెబ్బా జాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం.
కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ కంటెంట్ ని ఎలివేట్ చేయగా అనుభవజ్ఞులైన టెక్నికల్ టీమ్ మంచి క్వాలిటీని తీసుకురావడంలో దోహదపడింది. జనవరిలో సంక్రాంతి హడావుడి తర్వాత సరైన సీరియస్ మూవీ ఏదీ రాలేదు. మృత్యుంజయ్ ఆ లోటు తీర్చేలా ఉంది. ఆడియన్స్ ని కనక మెప్పించగలిగితే శ్రీవిష్ణు కొత్త జానర్ లో సూపర్ హిట్ దక్కినట్టు ఉంటుంది. చూడాలి.
This post was last modified on February 28, 2026 11:50 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…