రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 హఠాత్తుగా వాయిదా పడింది. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేరళ ఉన్నత న్యాయస్థానం రెండు వారాల గడువు ఇస్తూ ఆలోగా తదుపరి విచారణను పూర్తి చేయాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ వచ్చిన సినిమాకు ఇలా చివరి నిమిషంలో బ్రేక్ పడటం ఊహించని పరిణామం కావడంతో సుప్రీమ్ కోర్టుకు వెళ్లేందుకు నిర్మాత సిద్ధమవుతున్నట్టు ముంబై టాక్. అయితే షోలకు కేవలం కొద్దిగంటల ముందు ఇది పరిష్కారం అవుతుందా అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయ్యింది.
గత కొన్ని రోజులుగా కేరళ స్టోరీ 2 మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కేరళ రాష్ట్రం మీద మచ్చ తెచ్చే ప్రయత్నంగా పేర్కొంటూ ఆల్రెడీ పలు కేసులు దాఖలు కాగా నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ వివిధ సమావేశాల ద్వారా తమ ప్రయత్నాన్ని సమర్ధించుకోవడానికి చూస్తున్నారు.
నిజ జీవితంలో లవ్ జిహాద్ బారిన పడిన కొందరు బాధితులను తీసుకొచ్చి మీడియా సమావేశం పెడితే, వాళ్ళలో ఎవరూ కేరళకు చెందిన వాళ్ళు లేకపోవడం పెద్ద దుమారం రేపింది. అలాంటప్పుడు కేరళ స్టోరీ అని ఎందుకు టైటిల్ పెట్టారని జర్నలిస్టులు సైతం ఆక్షేపణ వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు రేపు దేశవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన కేరళ స్టోరీ 2 చివరి నిమిషంలో ఆగిపోవాల్సి వచ్చింది. నిజానికి కేరళ స్టోరీ మొదటి భాగం వచ్చినప్పుడు కూడా కాంట్రావర్సీ రేగింది. అయినా సరే ఎలాగోలా విడుదలకు రూట్ క్లియర్ చేసుకుని మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసుకుంది.
కేరళ స్టోరీ 2 కూడా అదే స్థాయిలో రాబడుతుందనే ధీమాలో టీమ్ ఉంది. అయితే ట్రైలర్ లో చూపించిన విజువల్స్, ఒక సామాజిక వర్గ మనోభావాలను గాయపరిచేలా ఉన్న సన్నివేశాల నేపథ్యంలో వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది. హిందీతో పాటు తెలుగు తమిళ ఇతర ప్రధాన భాషల్లో కేరళ 2 స్టోరీని మేకర్స్ సిద్ధం చేశారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…