Movie News

వివాదాస్పద సినిమాకు కోర్టు బ్రేకు

రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 హఠాత్తుగా వాయిదా పడింది. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేరళ ఉన్నత న్యాయస్థానం రెండు వారాల గడువు ఇస్తూ ఆలోగా తదుపరి విచారణను పూర్తి చేయాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ వచ్చిన సినిమాకు ఇలా చివరి నిమిషంలో బ్రేక్ పడటం ఊహించని పరిణామం కావడంతో సుప్రీమ్ కోర్టుకు వెళ్లేందుకు నిర్మాత సిద్ధమవుతున్నట్టు ముంబై టాక్. అయితే షోలకు కేవలం కొద్దిగంటల ముందు ఇది పరిష్కారం అవుతుందా అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయ్యింది.

గత కొన్ని రోజులుగా కేరళ స్టోరీ 2 మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కేరళ రాష్ట్రం మీద మచ్చ తెచ్చే ప్రయత్నంగా పేర్కొంటూ ఆల్రెడీ పలు కేసులు దాఖలు కాగా నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ వివిధ సమావేశాల ద్వారా తమ ప్రయత్నాన్ని సమర్ధించుకోవడానికి చూస్తున్నారు.

నిజ జీవితంలో లవ్ జిహాద్ బారిన పడిన కొందరు బాధితులను తీసుకొచ్చి మీడియా సమావేశం పెడితే, వాళ్ళలో ఎవరూ కేరళకు చెందిన వాళ్ళు లేకపోవడం పెద్ద దుమారం రేపింది. అలాంటప్పుడు కేరళ స్టోరీ అని ఎందుకు టైటిల్ పెట్టారని జర్నలిస్టులు సైతం ఆక్షేపణ వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు రేపు దేశవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన కేరళ స్టోరీ 2 చివరి నిమిషంలో ఆగిపోవాల్సి వచ్చింది. నిజానికి కేరళ స్టోరీ మొదటి భాగం వచ్చినప్పుడు కూడా కాంట్రావర్సీ రేగింది. అయినా సరే ఎలాగోలా విడుదలకు రూట్ క్లియర్ చేసుకుని మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసుకుంది.

కేరళ స్టోరీ 2 కూడా అదే స్థాయిలో రాబడుతుందనే ధీమాలో టీమ్ ఉంది. అయితే ట్రైలర్ లో చూపించిన విజువల్స్, ఒక సామాజిక వర్గ మనోభావాలను గాయపరిచేలా ఉన్న సన్నివేశాల నేపథ్యంలో వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది. హిందీతో పాటు తెలుగు తమిళ ఇతర ప్రధాన భాషల్లో కేరళ 2 స్టోరీని మేకర్స్ సిద్ధం చేశారు.

Kumar

Recent Posts

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

8 minutes ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

57 minutes ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

1 hour ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

2 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

3 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

4 hours ago