అర్జున్ రెడ్డితో సంచలనం రేపిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా అతడి పేరు చర్చనీయాంశమైంది. అర్జున్ రెడ్డి సౌత్ ఇండస్ట్రీలో ఎంతటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే. ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తే అక్కడా సెన్సేషనల్ హిట్టయింది.
కానీ అర్జున్ రెడ్డి వచ్చాక మూడేళ్ల తర్వాత కూడా సందీప్ నుంచి ఇంకో కొత్త సినిమా రాకపోవడం మాత్రం ఆయన అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. కబీర్ సింగ్ విడుదలయ్యాక కూడా ఏడాదిన్నర పాటు తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేదు. హిందీలోనే తన మూడో సినిమా చేయాలనుకున్నాడు కానీ.. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.
సందీప్ తన తర్వాతి చిత్రాన్ని హిందీలోనే, బాలీవుడ్ బడా స్టార్లలో ఒకడైన రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కించనున్నట్లు దాదాపు ఏడాది కిందటే వార్తలొచ్చాయి. కానీ చిత్రీకరణ మాత్రం ఇంకా మొదలవలేదు. ఒక దశలో ఈ కాంబోలో సినిమా క్యాన్సిల్ అని కూడా వార్తలొచ్చాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం సందీప్, రణబీర్ కలిసి సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాకు టైటిల్ కూడా ఖరారైందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అనిమల్ అనే ఆసక్తికర టైటిల్తో సందీప్ తన తర్వాతి సినిమా చేయనున్నాడట. ఈ టైటిల్ను బట్టి చూస్తే అర్జున్ రెడ్డి తరహాలోనే ఇందులోనూ హీరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని స్పష్టమవుతోంది. మరి సాఫ్ట్గా కనిపించే రణబీర్ను జంతువులాగా చూపించాలంటే సందీప్ చాలా కష్టపడాల్సిందే.
This post was last modified on December 20, 2020 12:14 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…