వనిత విజయ్ కుమార్.. ఈ పేరు ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పటికే మూడుసార్లు ఆమెకు పెళ్లయింది. మూడు బంధాలు చెడిపోయాయి. చివరగా లాక్ డౌన్ టైంలో పీటర్ అనే ఫిలిం మేకర్ను ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లి మీద నానా రచ్చ జరిగింది. పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరూ విడిపోయారు. దానికి సంబంధించిన రచ్చ ఇంకా కొనసాగుతుండగానే.. వనిత తాజాగా పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టు అందరినీ విస్మయానికి గురి చేసింది.
ఇన్ లవ్ అగైన్.. అంటూ సింపుల్గా ఒక మెసేజ్ పెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది వనిత. తాను గొడవ పడ్డ మూడో భర్త పీటర్తో సర్దుబాటు చేసుకుని ఆయనతో మళ్లీ ప్రేమలో పడ్డానని అంటోందా.. లేక అతడి నుంచి విడిపోయిన నేపథ్యంలో ఎవరైనా కొత్త వ్యక్తిని ప్రేమిస్తోందా అన్నది జనాలకు అర్థం కావడం లేదు.
వనిత ఉద్దేశం ఏదైనాప్పటికీ.. ఇన్ని వివాదాల తర్వాత మళ్లీ ప్రేమ మాట ఎత్తడమే జనాలకు మింగుడు పడటం లేదు. సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజులల తనయురాలైన ఈ అమ్మాయి చేసిన సినిమాలు చాలా తక్కువే. తెలుగులో దేవి లాంటి సూపర్ హిట్లో అమాయక అమ్మాయిగా నటించిన వనితకు.. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాలేదు. తమిళంలో కూడా ఫిలిం ఇండస్ట్రీలో పెద్దగా సాధించింది లేదు. కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో ఆమె తరచుగా వార్తల్లోకి వస్తుంటుంది.
కొన్నేళ్ల కిందట ఆస్తి విషయంలో గొడవల్లో భాగంగా తండ్రి విజయ్ కుమార్ను సైతం ఆమె రోడ్డుకీడ్చడం సంచలనం రేపింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో కొన్నాళ్లు వార్తల్లో నిలిచిన వనిత.. లాక్ డౌన్ టైంలో పీటర్ను పెళ్లాడటం.. కొన్ని నెలల్లోనే వీళ్లిద్దరూ గొడవపడి విడిపోవడం ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే.
This post was last modified on December 20, 2020 10:30 am
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…