వనిత విజయ్ కుమార్.. ఈ పేరు ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పటికే మూడుసార్లు ఆమెకు పెళ్లయింది. మూడు బంధాలు చెడిపోయాయి. చివరగా లాక్ డౌన్ టైంలో పీటర్ అనే ఫిలిం మేకర్ను ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లి మీద నానా రచ్చ జరిగింది. పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరూ విడిపోయారు. దానికి సంబంధించిన రచ్చ ఇంకా కొనసాగుతుండగానే.. వనిత తాజాగా పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టు అందరినీ విస్మయానికి గురి చేసింది.
ఇన్ లవ్ అగైన్.. అంటూ సింపుల్గా ఒక మెసేజ్ పెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది వనిత. తాను గొడవ పడ్డ మూడో భర్త పీటర్తో సర్దుబాటు చేసుకుని ఆయనతో మళ్లీ ప్రేమలో పడ్డానని అంటోందా.. లేక అతడి నుంచి విడిపోయిన నేపథ్యంలో ఎవరైనా కొత్త వ్యక్తిని ప్రేమిస్తోందా అన్నది జనాలకు అర్థం కావడం లేదు.
వనిత ఉద్దేశం ఏదైనాప్పటికీ.. ఇన్ని వివాదాల తర్వాత మళ్లీ ప్రేమ మాట ఎత్తడమే జనాలకు మింగుడు పడటం లేదు. సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజులల తనయురాలైన ఈ అమ్మాయి చేసిన సినిమాలు చాలా తక్కువే. తెలుగులో దేవి లాంటి సూపర్ హిట్లో అమాయక అమ్మాయిగా నటించిన వనితకు.. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాలేదు. తమిళంలో కూడా ఫిలిం ఇండస్ట్రీలో పెద్దగా సాధించింది లేదు. కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో ఆమె తరచుగా వార్తల్లోకి వస్తుంటుంది.
కొన్నేళ్ల కిందట ఆస్తి విషయంలో గొడవల్లో భాగంగా తండ్రి విజయ్ కుమార్ను సైతం ఆమె రోడ్డుకీడ్చడం సంచలనం రేపింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో కొన్నాళ్లు వార్తల్లో నిలిచిన వనిత.. లాక్ డౌన్ టైంలో పీటర్ను పెళ్లాడటం.. కొన్ని నెలల్లోనే వీళ్లిద్దరూ గొడవపడి విడిపోవడం ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే.
This post was last modified on December 20, 2020 10:30 am
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…