రాజకీయాల్లో చేదు అనుభవం చవిచూసి తిరిగి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవికి రీఎంట్రీలో అన్నీ దగ్గరుండి సెట్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఖైదీ నంబర్ 150, సైరా చిత్రాలను స్వీయ నిర్మాణంలో తీసాడు. సైరా చిత్రానికి సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎంచుకోవడం నుంచి పలు విషయాలపై చరణ్ చాలా శ్రద్ధ పెట్టాడు. అలాగే కొరటాల శివతో ఆచార్య సినిమా సెట్ అవడంలోను చరణ్ పాత్ర చాలా వుంది. చిరంజీవితో ఇప్పటి హాట్షాట్ డైరెక్టర్ సినిమా చేస్తే బాగుంటుందని చరణ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేయించాడు.
అంతే కాకుండా అందులో ఒక కీలక పాత్ర చేయడానికి కూడా అంగీకరించాడు. లూసిఫర్ సినిమా చూసి రైట్స్ తీసుకున్న చరణ్ అప్పట్లో తనకో కథ చెప్పడానికి వచ్చిన సుజీత్కి రీమేక్ బాధ్యతలు అప్పగించాడు. అతడు అనుకున్న మార్పు చేర్పులు చేయలేకపోతే వినాయక్ చేతిలో స్క్రిప్ట్ పెట్టాడు.
అతడు కూడా చిరంజీవికి అనుగుణంగా మార్పులు చేయకపోవడంతో తమిళ దర్శకుడు మోహన్ రాజాని పిలిపించాడు. ధృవ ఒరిజినల్ని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా అప్పట్లో చరణ్ని కలిసి డైరెక్ట్ తెలుగు సినిమా చేయడం కోసం కథ చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు కానీ అతడిని డాడీ వైపు చరణ్ డైవర్ట్ చేసేసాడు.
This post was last modified on December 20, 2020 12:34 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…