స్పై సినిమాల మీద ఒక యూనివర్శ్నే క్రియేట్ చేసి.. భారీ విజయాలు అందుకుంది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, టైగర్-3, పఠాన్, వార్, వార్-2.. ఈ యూనివర్శ్లో భాగంగా వచ్చిన సినిమాలే. ఐతే ఒక దశ వరకు ఈ యూనివర్శ్ సినిమాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి కానీ.. గత కొన్నేళ్ల నుంచి ఈ ఫార్ములా వర్కవుట్ కావడం లేదు.
టైగర్-3తో తొలి షాక్ తిన్న యశ్ రాజ్ ఫిలిమ్స్… గత ఏడాది వార్-2 రూపంలో ఇంకో గట్టి ఎదురు దెబ్బను తీసుకుంది. ఒక మూసలో సాగిపోతున్న యశ్ రాజ్ స్పై యూనివర్శ్ ప్రేక్షకులకు మొహం మొత్తేస్తోందని స్పష్టమైపోయింది. దీంతో ఈ యూనివర్శ్లో భాగంగా ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా డ్రాప్ చేసేస్తోంది యశ్ రాజ్ సంస్థ.
వార్-3, పఠాన్-2, టైగర్-4 చిత్రాలు రావని ఇప్పటికే అర్థమైపోయింది. ఇవి కాకుండా టైగర్ వెర్సస్ పఠాన్ అంటూ ఒక మల్టీవర్స్ మూవీ చేయాలని యశ్ రాజ్ వాళ్లు గతంలో ప్రణాళిక రచించారు.
షారుఖ్ హీరోగా చేసిన పఠాన్ సినిమాలో టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్ క్యామియో పెడితే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ఆ ఎపిసోడ్ హైలైట్గా నిలిచింది. అది చూసి.. పఠాన్, టైగర్ పాత్రలతో ఫుల్ లెంగ్త్ సినిమా తీస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని యశ్ రాజ్ సంస్థ భావించింది. సిద్దార్థ్ ఆనంద్ లేదా అయాన్ ముఖర్జీతో ఈ సినిమా తీయించాలనుకున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ రైటింగ్ టీం దీని మీద పని చేసింది కూడా.
కానీ వార్-2 రిజల్ట్ చూశాక అసలీ స్పై యూనివర్శ్ మనుగడే ప్రమాదంలో పడడంతో టైగర్ వెర్సస్ పఠాన్ సినిమా మీద ఆశలు వదులుకున్నారట. సల్మాన్ మార్కెట్ కూడా బాగా డౌన్ అయిపోవడంతో ఇప్పుడీ సినిమా తీసి ఆయనతో పాటు షారుఖ్ను ఇబ్బంది పెట్టడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండబోదని యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదత్య చోప్రా ఒక నిర్ణయానికి వచ్చారట. బాలీవుడ్ మీడియా కూడా ఈ మేరకు వార్తలు ఇస్తోంది. టైగర్ వెర్సస్ పఠాన్ మాత్రమే కాదు.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్శ్ నుంచి ఇకపై ఏ సినిమా రాకపోవచ్చని తెలుస్తోంది.
Image – YRF
This post was last modified on February 14, 2026 8:56 pm
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో బీఆర్ఎస్ కు వచ్చిన స్థానాల నేపథ్యంలో ఆ పార్టీకి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత…
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఒక కల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయిన అదుర్స్ వచ్చి పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి.…
ఇటలీ వేదికగా జరుగుతున్న 2026 వింటర్ ఒలింపిక్స్లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆటల పోటీలు మొదలైన కొన్ని…
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్డౌన్ మొదలైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు…
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా…