Movie News

పరుగులు పెట్టవయ్యా విశ్వంభరా

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఓటిటిలో వచ్చి అక్కడా కూడా రికార్డుల బూజు దులుపుతోంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చూపు విశ్వంభర వైపు వెళ్తోంది. విఎఫ్ఎక్స్ పనుల మీద ఏడాదికి పైగానే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మెగా ఫాంటసీ మూవీకి ఇప్పటిదాకా డేట్ ఖరారు కాలేదు.

కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దీని ప్రస్తావన వచ్చినా చెప్పాల్సింది వంశీనే అంటూ ప్రమోద్ స్మార్ట్ గా తప్పించుకోవడం అనుమానాలను మరింత బలపరిచింది. దర్శకుడు వశిష్ఠ ఈ మధ్య బయట కనిపిస్తున్నాడు. ట్విట్టర్ స్పేస్ లో పాల్గొని అభిమానులతో కొన్ని కబుర్లు పంచుకున్నాడు. ఇక్కడి దాకా బాగానే ఉంది.

కానీ అసలు కబురు ఎవరు చెప్పడం లేదు. ఇన్ సైడ్ టాక్ అయితే ఇంకా గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదట. అయినంత వరకు అవుట్ ఫుట్ చూసిన చిరంజీవి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో కొన్ని భాగాలకు మళ్ళీ వర్క్ చేయాల్సి రావొచ్చు.

అయితే గత ఏడాది ఘాటీ దెబ్బ గట్టిగా పడటంతో పాటు శర్వానంద్ బైకర్ వాయిదాలు యువి మీద ఆర్థికంగా ప్రభావం చూపించాయి. ఒకవేళ కపుల్ ఫ్రెండ్లీ హిట్టయినా మరీ మురిసిపోయేంత డబ్బులు వస్తాయా లేదానేది చెప్పలేం. ఫైనాన్షియల్ గా బైకర్ నుంచే ఎక్కుడ డబ్బులు రావాలి. అప్పటి దాకా విశ్వంభర పనులకు బ్రేక్ పడతాయా అంటే ఏమో అంటున్నాయి అంతర్గత వర్గాలు.

గతంలో ఇదే తరహా పరిస్థితి చిరంజీవి అంజి విషయంలో ఎదురుకున్నారు. అది ఏకంగా ఆరేళ్ళు ప్రొడక్షన్ లో ఉండి విపరీతమైన ఆర్థిక భారాన్ని మోసింది. కానీ విశ్వంభర అంత తీవ్రంగా లేదు కానీ ఆల్రెడీ రెండు సంవత్సరాలు దాటిపోయాయి కాబట్టి ఒకరకంగా దీన్ని డేంజర్ బెల్ గా భావించి డెడ్ లైన్ పెట్టుకుని వర్క్ చేయాలి.

మన శంకరవరప్రసాద్ గారుతో తన మార్కెట్ స్టామినా ఋజువు చేసుకున్న చిరంజీవి తన రాబోయే సినిమాల్లో రాజీ పడే ప్రసక్తే లేదంటూ అవుట్ ఫుట్ మీద దృష్టి పెడుతున్నారట. సో విశ్వంభర వేసవిలో రావడం కూడా అనుమానమే అంటున్నారు. అదే జరిగితే దసరా లేదా దీపావళికి షిఫ్ట్ అవ్వాలి.

This post was last modified on February 13, 2026 12:15 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Vishwambhara

Recent Posts

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago