Movie News

నరేష్… హీరోయిన్ కు హగ్ ఇవ్వబోయి

గత ఏడాది క్రిస్మస్ కానుగకా రిలీజైన ‘దండోరా’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన సీనియర్ నటుడు శివాజీ.. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే.

ఆ ఈవెంట్లో చీర కట్టుకుని వచ్చిన యాంకర్‌ను ఆభినందిస్తూ.. మహిళలు అలా ఉంటేనే బాగుంటుందని, అర్ధనగ్నంగా బట్టలు వేసుకుంటే ఇబ్బందిగా ఉంటుందని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఐతే ఆ వ్యాఖ్యలను కొందర సమర్థిస్తే.. కొందరు తీవ్రంగా విమర్శించారు.

గాయని చిన్మయి, యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ లాంటి వాళ్లు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. కొన్ని వారాల పాటు ఆ టాపిక్ మీద డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. ఐతే అందరూ మరిచిపోయిన ఆ టాపిక్‌ను సీనియర్ నటుడు నరేష్ మళ్లీ గుర్తు చేశారు.

తాను ముఖ్య పాత్ర పోషించిన ‘హే భగవాన్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమ సినిమా ట్రైలర్ లాంచ్ జరిగిన రోజు హగ్ డే అని గుర్తు చేస్తూ.. స్టేజ్ మీద ఉన్న ఒక్కొక్కరినీ హత్తుకోవడం మొదలుపెట్టారు నరేష్. ఐతే మగాళ్లకు హగ్స్ ఇచ్చిన అనంతరం అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి ఆయన తనను తాను నియంత్రించుకున్నారు.

ఈ సినిమా హీరోయిన్ శివాని నగరం, యాంకర్ స్రవంతిలను కూడా తాను హగ్ చేసుకుందామని అనుకున్నానని.. కానీ వాళ్లిద్దరూ చీరలు కట్టుకుని వచ్చారని.. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన తర్వాత చాలామంది అమ్మాయిలు సినిమా ఈవెంట్లకు చీరలు కట్టుకునే వస్తున్నారని.. భారతీయ సంప్రదాయం ప్రకారం చీరలు కట్టుకున్న మహిళలను కౌగిలించుకోవడం సరి కాదని.. అందుకే తాను ఆగిపోయానని చెప్పాడు నరేష్.

అనంతరం ఒకరినొకరు మీరే కౌగిలించుకోండి అంటూ శివాని, స్రవంతిలకు నరేష్ చెప్పగా.. వాళ్లిద్దరూ ఆయన మాటలను అనుసరించారు. దండోరా ఈవెంట్ గురించి, శివాజీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా.. నాటి ఆ వివాదాన్ని దృష్టిలో ఉంచుకునే నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం.

This post was last modified on February 13, 2026 8:30 am

Share
Show comments
Published by
Kumar
Tags: Naresh

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

30 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

33 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago