Movie News

మావయ్యతో వరప్రసాద్… మేనల్లుడితో ‘క’ కలయిక

మన శంకరవరప్రసాద్ గారుతో రీజనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత సాహూ గారపాటి కొత్త సినిమా ‘క’ దర్శకులు సుజిత్ అండ్ సందీప్ తో లాకైనట్టు సమాచారం. కిరణ్ అబ్బవరంకి అదిరిపోయే థ్రిల్లర్ హిట్ ఇచ్చిన ఈ దర్శక ద్వయం తర్వాత మూవీ ఏంటనేది ఏడాదికి పైగా సస్పెన్స్ లో ఉంది.

పలువురు ప్రొడ్యూసర్లతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఫైనల్ గా సాహూ చేతికి ఈ కాంబినేషన్ సాధ్యమైనట్టు తెలిసింది. ఉగాది పండక్కు ఓపెనింగ్ చేసి పూర్తి వివరాలను ప్రకటించబోతున్నారు. సంబరాల ఏటిగట్టు ఫినిషింగ్ లో ఉన్న సాయి దుర్గ తేజ్ తో ఈ క్రేజీ ప్రాజెక్టుని తెరకెక్కించబోతున్నారు. ఇక్కడో విశేషం ఉంది.

మావయ్యతో బ్లాక్ బస్టర్ తీసిన సాహూ గారపాటి ఇప్పుడు ఆయన మేనల్లుడితో జట్టు కట్టబోతున్నారు. చిరంజీవి, సాయి దుర్గ తేజ్ మధ్య ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే. ఇది కూడా క తరహాలో థ్రిల్లర్ కాన్సెప్టట. కానీ దానికి కొనసాగింపు కాదని, పూర్తి వేరే కథతో ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో తీస్తారని వినికిడి.

సుజిత్ అండ్ సందీప్ లాంటి యువ దర్శకులు ఏడాదిన్నర పైగా టైం తీసుకోవడం చూస్తే కంటెంట్ ఏదో బలంగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు చేస్తున్నారు. క్యాస్టింగ్ ఇంకో వారం పది రోజుల్లో కొలిక్కి తెచ్చి ఉగాది రోజు లాంచ్ చేస్తారని సమాచారం.

ఇది పక్కన పెడితే సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెజిఎఫ్ రేంజ్ లో హీరోయిజం, ఎలిమెంట్స్, ఎలివేషన్స్ ఇందులో ఉంటాయని, గతంలో సాయి దుర్గ తేజ్ ఎప్పుడూ చూడని ఒకసరికొత్త షేడ్ ని ఇందులో చూపించబోతున్నట్టు యూనిట్ న్యూస్.

ఆల్రెడీ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి ట్రైలర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని వేసవికి విడుదల చేసి ఇప్పుడు సుజిత్ అండ్ సందీప్ కాంబోలో చేస్తున్న మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. చూడాలి మరి ఏం జరగనుందో.

This post was last modified on February 10, 2026 10:37 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

29 minutes ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

1 hour ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

3 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

4 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

4 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

6 hours ago