మన శంకరవరప్రసాద్ గారుతో రీజనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత సాహూ గారపాటి కొత్త సినిమా ‘క’ దర్శకులు సుజిత్ అండ్ సందీప్ తో లాకైనట్టు సమాచారం. కిరణ్ అబ్బవరంకి అదిరిపోయే థ్రిల్లర్ హిట్ ఇచ్చిన ఈ దర్శక ద్వయం తర్వాత మూవీ ఏంటనేది ఏడాదికి పైగా సస్పెన్స్ లో ఉంది.
పలువురు ప్రొడ్యూసర్లతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఫైనల్ గా సాహూ చేతికి ఈ కాంబినేషన్ సాధ్యమైనట్టు తెలిసింది. ఉగాది పండక్కు ఓపెనింగ్ చేసి పూర్తి వివరాలను ప్రకటించబోతున్నారు. సంబరాల ఏటిగట్టు ఫినిషింగ్ లో ఉన్న సాయి దుర్గ తేజ్ తో ఈ క్రేజీ ప్రాజెక్టుని తెరకెక్కించబోతున్నారు. ఇక్కడో విశేషం ఉంది.
మావయ్యతో బ్లాక్ బస్టర్ తీసిన సాహూ గారపాటి ఇప్పుడు ఆయన మేనల్లుడితో జట్టు కట్టబోతున్నారు. చిరంజీవి, సాయి దుర్గ తేజ్ మధ్య ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే. ఇది కూడా క తరహాలో థ్రిల్లర్ కాన్సెప్టట. కానీ దానికి కొనసాగింపు కాదని, పూర్తి వేరే కథతో ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో తీస్తారని వినికిడి.
సుజిత్ అండ్ సందీప్ లాంటి యువ దర్శకులు ఏడాదిన్నర పైగా టైం తీసుకోవడం చూస్తే కంటెంట్ ఏదో బలంగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు చేస్తున్నారు. క్యాస్టింగ్ ఇంకో వారం పది రోజుల్లో కొలిక్కి తెచ్చి ఉగాది రోజు లాంచ్ చేస్తారని సమాచారం.
ఇది పక్కన పెడితే సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెజిఎఫ్ రేంజ్ లో హీరోయిజం, ఎలిమెంట్స్, ఎలివేషన్స్ ఇందులో ఉంటాయని, గతంలో సాయి దుర్గ తేజ్ ఎప్పుడూ చూడని ఒకసరికొత్త షేడ్ ని ఇందులో చూపించబోతున్నట్టు యూనిట్ న్యూస్.
ఆల్రెడీ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి ట్రైలర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని వేసవికి విడుదల చేసి ఇప్పుడు సుజిత్ అండ్ సందీప్ కాంబోలో చేస్తున్న మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. చూడాలి మరి ఏం జరగనుందో.
This post was last modified on February 10, 2026 10:37 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…