మాములుగా సినిమాలో కంటెంట్ మీద సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ టైటిల్ మీద అబ్జెక్షన్ చెప్పడం అరుదుగా జరుగుతుంటుంది. చాలా సంవత్సరాల క్రితం నరేష్ నటించిన ఒక మూవీకి పోలీసోడి పెళ్ళాం అని పేరు పెట్టారు. దీంతో డిపార్ట్ మెంట్ నుంచి వ్యతిరేకత వచ్చింది.
ఏకవచనం పాటు వినడానికి ఇబ్బందిగా ఉందని దర్శక నిర్మాతల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అది కాస్తా పోలీస్ భార్యగా మారిపోయి సూపర్ హిట్ అందుకుంది. ఆ మధ్య విజయ్ తేరి డబ్బింగ్ కి పోలీసోడు అని పెట్టారు. మళ్ళీ అదే రిపీటయ్యింది. థియేటర్ రిలీజ్ టైంలో హక్కులు కొన్న దిల్ రాజు దాన్ని పోలీస్ గా మార్చారు.
తాజాగా కపుల్ ఫ్రెండ్లీ విషయంలోనూ అలాగే జరిగిందట. నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ పేరు మారిస్తే యు/ఏ ఇస్తామని చెప్పారని, కానీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయితే జరిగే డ్యామేజ్ ఎక్కువ కనక ఏ సర్టిఫికెట్ తీసుకున్నామని అన్నారు.
నిజానికి కపుల్ ఫ్రెండ్లీలో బూతు లేదు. ఫ్రెండ్లీ కపుల్ అని మారిస్తే కొంచెం బెటర్ గా అనిపించవచ్చేమో కానీ అపార్థం చేసుకోవాల్సిన డబుల్ మీనింగ్ రెండింటిలో లేదు. మరి ధీరజ్ అన్నట్టు నిజంగా కేవలం పేరుకే ఇచ్చారా లేక సినిమాలో ఉన్న కొన్ని లిప్ లాక్ సీన్లు, లవ్ ఎపిసోడ్లకు ఇచ్చారా అనేది ఫిబ్రవరి 14 థియేటర్లకు వచ్చాక తేలనుంది.
యువి సంస్థ నిర్మించిన కపుల్ ఫ్రెండ్లీ ప్రేమికుల రోజు విడుదల కానుంది. హీరో సంతోష్ శోభన్ దీని మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. తన ఫ్లాపుల ప్రవాహానికి బ్రేకులు వేస్తుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికైతే ప్రమోషనల్ కంటెంట్ యూత్ కి బాగానే రీచ్ అయినట్టు ఉంది. కాకపోతే అవసరమైన హైప్ ఇంకా పెరగాల్సి ఉంది.
పోటీలో విశ్వక్ సేన్ ఫంకీ, అర్జున్ డైరెక్ట్ చేసిన సీత పయనంతో పాటు రీ రిలీజులు మనసంతా నువ్వే, లవ్ స్టోరీ ఉన్నాయి. మరి కపుల్ ఫ్రెండ్లీ వీటిని ఎలా దాటుకుంటుందో చూడాలి. సినిమా మాత్రం కుటుంబం మొత్తం చూసే స్వచ్ఛమైన ప్రేమకథగా ఉంటుందని టీమ్ నొక్కి వక్కాణిస్తోంది.
This post was last modified on February 10, 2026 3:05 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…