భారతీయ సినిమా చరిత్రలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే.. అందులో ‘దృశ్యం’ ముందు వరుసలో ఉంటుంది. ఈ మలయాళ చిత్రాన్ని ఇండియాలోని పలు భాషల్లోనే కాక విదేశీ భాషల్లో సైతం రీమేక్ చేశారంటే.. అదెంత పవర్ ఫుల్ మూవీనో అర్థం చేసుకోవచ్చు. ఏ భాషలో రీమేక్ చేసినా మంచి ఫలితాన్నే అందుకుంది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ నేరుగా ఓటీటీలో రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా రాబోతోంది.
మోహన్ లాల్ హీరోగా జీతు జోసెఫ్ ఆల్రెడీ ‘దృశ్యం-3’ షూట్ పూర్తి చేశాడు. ఏప్రిల్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందకు రాబోతోంది. ఐతే ఈ సినిమా మొదలైనపుడు.. ఇందులో ట్విస్టుల కంటే డ్రామా ఎక్కువ ఉంటుందని.. ఫ్రాంఛైజీలో తొలి రెండు చిత్రాల స్థాయిలో థ్రిల్స్ను ఊహించుకోవద్దని అన్నాడు జీతు జోసెఫ్. ఏదైనా సీక్వెల్ వస్తోందంటే.. ఇంకా హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. కానీ జీతు మాత్రం పనిగట్టుకుని అంచనాలను తగ్గిస్తున్నట్లు అనిపించింది.
ఐతే ఇప్పుడు జీతు వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడుతోంది ఆ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన ఆశా శరత్. హీరో చేతిలో హత్యకు గురైన కుర్రాడి తల్లిగా, పోలీసాఫీసర్గా ‘దృశ్యం’ తొలి రెండు భాగాల్లో కీలక పాత్ర పోషించింది ఆశా. ఆమె ‘దృశ్యం-3’ క్లైమాక్స్ గురించి ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చింది.
‘‘దృశ్యం-3 క్లైమాక్స్ చూసి స్టన్ అయిపోతారు. ఇది నిజమా అని ఆశ్చర్యపోతారు. ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే సినిమా ఇది’’ అంటూ కొనియాడారు ఆశా శరత్.
సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నటి ఇలా చెబుతోందంటే ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ లాగే ‘దృశ్యం-3’ కూడా వేరే లెవెల్లోనే ఉంటుందని ఆశించవచ్చు.
ముందే అంచనాలు పెంచుకోవద్దనే జీతు జోసెఫ్ సినిమా మొదలవుతున్నపుడు అలా చెప్పి ఉండొచ్చు. ముందుగా మలయాళంలో రిలీజయ్యాక ‘దృశ్యం-3’ని హిందీ, తెలుగు భాషల్లోనూ రీమేక్ చేయనున్నారు. ఇంతకుముందులాగే హిందీలో అజయ్ దేవగణ్, తెలుగులో విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్స్ చేస్తారు.
This post was last modified on February 9, 2026 12:06 pm
బాహుబలి, కెజిఎఫ్, పుష్ప తర్వాత ఒక సీక్వెల్ కోసం మూవీ లవర్స్ విపరీతంగా ఎదురు చూసిన సినిమా దురంధర్ ది…
హారర్, కామెడీ మిక్స్ చేస్తూ రివెంజ్ డ్రామాలో ఒక్క కొత్త ఫార్ములా సృష్టించిన ఘనత హీరో కం దర్శకుడు లారెన్స్…
“భారత దేశం సర్వసత్తాక సార్వభౌమ దేశం. ఇతర దేశాలకు తలవొంచదు. ఎవరో చెప్పినట్టు కూడా నడుచుకోదు. ఎవరి ఆదేశాలనో పాటించాల్సిన…
వచ్చే 15 ఏళ్లపాటు కూటమి అధికారంలో ఉండాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బలంగా చెబుతున్న విషయం…
యుద్ధం.. అక్కడి వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపితే.. మనపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తోంది. గ్యాస్, పెట్రోల్ ధరలు. పెరుగుతాయని నిపుణులు…
2029లో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్పటి నుంచే ఆయుధాలను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి పదును కూడాపెంచుకుంటున్నాయా?…