ఒక్కడు, చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడిగా గుణశేఖర్ ఆ తర్వాత ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా ఆయనంటే మూవీ లవర్స్ కి ఇప్పటికీ గౌరవముంది. రుద్రమదేవికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడానికి కారణం అదే.
వరుడు డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గా కాక ఒక ఫిలిం మేకర్ గా ఆయనకు ఇచ్చిన రెస్పెక్ట్ గా చెప్పుకోవచ్చు. శాకుంతలంకు ఆర్థిక ఇబ్బందుల వల్ల బ్రేకులు పడితే నిర్మాత దిల్ రాజు రంగంలోకి ఎందుకు దిగారంటే దానికి రీజన్ గుణశేఖర్ అనే బ్రాండ్. అందుకే యూఫోరియా మీద అంతో ఇంతో సాఫ్ట్ కార్నర్ ఇటు పరిశ్రమలో అటు ప్రేక్షకుల్లో కనిపించింది.
అయితే వెబ్ సిరీస్ ల ప్రభావమో లేక ట్రెండ్ ఇలా ఉందనుకుని ప్రభావితం చెందిన వైనమో ఏమో కానీ గుణశేఖర్ ఇందులో తనకు సూటవ్వని జానర్ లోకి వెళ్లిపోవడం చాలా మందికి షాక్ ఇచ్చింది.
జైల్లో ఉండే దారుణమైన పరిస్థితులను పచ్చిగా చూపించడం, డ్రగ్స్ కు బానిసైన యువకుడు కన్నతల్లి వరసను కూడా మర్చిపోవడం, టీనేజ్ వయసున్న కొడుకుని పెట్టుకుని ఒక మధ్యవయసు మహిళా తాగుబోతుగా మారడం ఇవన్నీ మరీ మోతాదు మించిపోయాయి. గౌతమ్ మీనన్ ఉన్న మానభంగం సీన్ రీ క్రియేషన్ అయితే మరీ టూ మచ్ అనిపించేసింది. ఇక్కడ చెప్పినవన్నీ సినిమాలో మైనస్ అయ్యాయి.
నిజానికి గుణశేఖర్ ఉద్దేశం మంచిదే. కానీ ఏదో నెట్ ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ తీస్తున్నాననే తరహాలో ఇంత పచ్చిగా కొన్ని సీన్లు చూపించడం ఫ్యామిలీ ప్రేక్షకులను పూర్తిగా దూరం చేశాయి. యూత్ కూడా అంత పెయిన్ ని తెరమీద చూడలేక విత్ లవ్ కు వెళ్లిపోతున్నారు.
అందుకే యూఫోరియా కలెక్షన్లు తక్కువగా ఉండటం మాత్రమే కాక వీకెండ్ ని కూడా వాడుకోలేని వైనం కనిపిస్తోంది. ఓటిటిలో వచ్చాక జనాల రెస్పాన్స్ ఎలా ఉంటుందో కానీ పైన చెప్పిన ఎపిసోడ్స్ తాలూకు మోతాదు తగ్గించి సెకండాఫ్ ని ఇంకోలా రాసుకుని ఉంటే యుఫొరియా ఖచ్చితంగా డీసెంట్ కంటెంట్ అయ్యేది. ఛాన్స్ మిస్ చేశారు.
This post was last modified on February 8, 2026 10:24 pm
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెనక్కి…
వచ్చే వారం మార్చి 13 విడుదల కావాల్సిన బ్యాండ్ మేళం ఇరవై రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 3కి వెళ్లిపోయింది.…
స్టార్ హీరోల సినిమాల్లో అభిమానులు ప్రధానంగా ఆశించేది ఎలివేషన్ సీన్లు.. డ్యాన్సులు, ఫైట్లు. ఇవి ఉంటే, కథ కొంచెం అటు…
ఇటీవల టాలీవుడ్ అనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన పెళ్లి వేడుక అంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలదే.…
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను…
వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు…