ఒక్కడు, చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడిగా గుణశేఖర్ ఆ తర్వాత ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా ఆయనంటే మూవీ లవర్స్ కి ఇప్పటికీ గౌరవముంది. రుద్రమదేవికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడానికి కారణం అదే.
వరుడు డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గా కాక ఒక ఫిలిం మేకర్ గా ఆయనకు ఇచ్చిన రెస్పెక్ట్ గా చెప్పుకోవచ్చు. శాకుంతలంకు ఆర్థిక ఇబ్బందుల వల్ల బ్రేకులు పడితే నిర్మాత దిల్ రాజు రంగంలోకి ఎందుకు దిగారంటే దానికి రీజన్ గుణశేఖర్ అనే బ్రాండ్. అందుకే యూఫోరియా మీద అంతో ఇంతో సాఫ్ట్ కార్నర్ ఇటు పరిశ్రమలో అటు ప్రేక్షకుల్లో కనిపించింది.
అయితే వెబ్ సిరీస్ ల ప్రభావమో లేక ట్రెండ్ ఇలా ఉందనుకుని ప్రభావితం చెందిన వైనమో ఏమో కానీ గుణశేఖర్ ఇందులో తనకు సూటవ్వని జానర్ లోకి వెళ్లిపోవడం చాలా మందికి షాక్ ఇచ్చింది.
జైల్లో ఉండే దారుణమైన పరిస్థితులను పచ్చిగా చూపించడం, డ్రగ్స్ కు బానిసైన యువకుడు కన్నతల్లి వరసను కూడా మర్చిపోవడం, టీనేజ్ వయసున్న కొడుకుని పెట్టుకుని ఒక మధ్యవయసు మహిళా తాగుబోతుగా మారడం ఇవన్నీ మరీ మోతాదు మించిపోయాయి. గౌతమ్ మీనన్ ఉన్న మానభంగం సీన్ రీ క్రియేషన్ అయితే మరీ టూ మచ్ అనిపించేసింది. ఇక్కడ చెప్పినవన్నీ సినిమాలో మైనస్ అయ్యాయి.
నిజానికి గుణశేఖర్ ఉద్దేశం మంచిదే. కానీ ఏదో నెట్ ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ తీస్తున్నాననే తరహాలో ఇంత పచ్చిగా కొన్ని సీన్లు చూపించడం ఫ్యామిలీ ప్రేక్షకులను పూర్తిగా దూరం చేశాయి. యూత్ కూడా అంత పెయిన్ ని తెరమీద చూడలేక విత్ లవ్ కు వెళ్లిపోతున్నారు.
అందుకే యూఫోరియా కలెక్షన్లు తక్కువగా ఉండటం మాత్రమే కాక వీకెండ్ ని కూడా వాడుకోలేని వైనం కనిపిస్తోంది. ఓటిటిలో వచ్చాక జనాల రెస్పాన్స్ ఎలా ఉంటుందో కానీ పైన చెప్పిన ఎపిసోడ్స్ తాలూకు మోతాదు తగ్గించి సెకండాఫ్ ని ఇంకోలా రాసుకుని ఉంటే యుఫొరియా ఖచ్చితంగా డీసెంట్ కంటెంట్ అయ్యేది. ఛాన్స్ మిస్ చేశారు.
This post was last modified on February 8, 2026 10:24 pm
గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి…
రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమాల ప్రమోషన్ల ఘట్టం ముగిసిపోయింది. ఎవరికి వారు శాయశక్తులా తమ పబ్లిసిటీకి ఏమేం కావాలో…
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…