థియేటర్లు మూత పడ్డాక కొంత కాలానికి మొదలైన ఓటీటీల జోరు.. నిరాటంకంగా సాగుతూ వచ్చింది. అక్టోబరు మధ్య నుంచి దేశవ్యాప్తంగా థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు రాగా.. పూర్తి స్థాయిలో అయితే థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో ఓటీటీ హవా కొనసాగింది. నవంబరులో అయితే వివిధ భాషల్లో రికార్డు స్థాయిలో కొత్త చిత్రాలు ఓటీటీల్లో రిలీజయ్యాయి.
దక్షిణాది సినిమాల విషయానికి వస్తే.. సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) లాంటి భారీ చిత్రంతో పాటు మిస్ ఇండియా, మా వింత గాథ వినుమా, మిడిల్ క్లాస్ మెలోడీస్, అంధకారం లాంటి సినిమాలు నవంబరులో ప్రేక్షకులను పలకరించాయి. ఈ జోరు ఇలాగే కొనసాగుతుందని.. డిసెంబరులోనూ కొత్త సినిమాలు సందడి చేస్తాయని ఆశించారు ప్రేక్షకులు. కానీ ఈ నెల మరీ నిస్సారంగా సాగిపోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యనే థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి. కానీ వాటిలో ప్రదర్శించడానికి కాస్త పేరున్న సినిమాలు కూడా అందుబాటులో లేవు. హాలీవుడ్ మూవీ ‘టెనెట్’ మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏ సినిమా లేదు. అది కొన్ని రోజులు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. తర్వాత థియేటర్లు ఖాళీ. రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ జనాలను కనీస స్థాయిలో కూడా ఆకర్షించలేకపోయింది. ప్రస్తుతం థియేటర్లు వెలవెలబోతున్నాయి. మెయింటైనెన్స్ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక షోలు ఆపేస్తున్నారు. ఈ సమయంలో ఓటీటీలు సైతం ప్రేక్షకుల గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఈ నెలలో ఓ ప్రముఖ ఓటీటీలోనూ చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు విడుదల కాలేదు. ‘డర్టీ హరి’ అంటూ ఎం.ఎస్.రాజు పే పర్ వ్యూ పద్ధతిలో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇది మినహాయిస్తే ఈ నెలలో ఓటీటీల్లో కాస్త పేరున్న సినిమా కూడా ఏదీ రిలీజ్ కావట్లేదు. క్రిస్మస్ సీజన్ను పురస్కరించుకుని కూడా కొత్త సినిమాలను ప్లాన్ చేయలేదు ఓటీటీలు. ఆ సమయానికి థియేటర్లలో సందడి పెంచడానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుత డల్ సీజన్లో అది ఏమాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. మొత్తానికి ఈ నెలలో ఓటీటీలు వెలవెలబోతున్నాయి. థియేటర్లలో కూడా సందడి లేదు. ప్రేక్షకుల పరిస్థితి రెంటికీ చెడ్డట్లు తయారైంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…