థియేటర్లు మూత పడ్డాక కొంత కాలానికి మొదలైన ఓటీటీల జోరు.. నిరాటంకంగా సాగుతూ వచ్చింది. అక్టోబరు మధ్య నుంచి దేశవ్యాప్తంగా థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు రాగా.. పూర్తి స్థాయిలో అయితే థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో ఓటీటీ హవా కొనసాగింది. నవంబరులో అయితే వివిధ భాషల్లో రికార్డు స్థాయిలో కొత్త చిత్రాలు ఓటీటీల్లో రిలీజయ్యాయి.
దక్షిణాది సినిమాల విషయానికి వస్తే.. సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) లాంటి భారీ చిత్రంతో పాటు మిస్ ఇండియా, మా వింత గాథ వినుమా, మిడిల్ క్లాస్ మెలోడీస్, అంధకారం లాంటి సినిమాలు నవంబరులో ప్రేక్షకులను పలకరించాయి. ఈ జోరు ఇలాగే కొనసాగుతుందని.. డిసెంబరులోనూ కొత్త సినిమాలు సందడి చేస్తాయని ఆశించారు ప్రేక్షకులు. కానీ ఈ నెల మరీ నిస్సారంగా సాగిపోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యనే థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి. కానీ వాటిలో ప్రదర్శించడానికి కాస్త పేరున్న సినిమాలు కూడా అందుబాటులో లేవు. హాలీవుడ్ మూవీ ‘టెనెట్’ మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏ సినిమా లేదు. అది కొన్ని రోజులు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. తర్వాత థియేటర్లు ఖాళీ. రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ జనాలను కనీస స్థాయిలో కూడా ఆకర్షించలేకపోయింది. ప్రస్తుతం థియేటర్లు వెలవెలబోతున్నాయి. మెయింటైనెన్స్ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక షోలు ఆపేస్తున్నారు. ఈ సమయంలో ఓటీటీలు సైతం ప్రేక్షకుల గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఈ నెలలో ఓ ప్రముఖ ఓటీటీలోనూ చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు విడుదల కాలేదు. ‘డర్టీ హరి’ అంటూ ఎం.ఎస్.రాజు పే పర్ వ్యూ పద్ధతిలో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇది మినహాయిస్తే ఈ నెలలో ఓటీటీల్లో కాస్త పేరున్న సినిమా కూడా ఏదీ రిలీజ్ కావట్లేదు. క్రిస్మస్ సీజన్ను పురస్కరించుకుని కూడా కొత్త సినిమాలను ప్లాన్ చేయలేదు ఓటీటీలు. ఆ సమయానికి థియేటర్లలో సందడి పెంచడానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుత డల్ సీజన్లో అది ఏమాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. మొత్తానికి ఈ నెలలో ఓటీటీలు వెలవెలబోతున్నాయి. థియేటర్లలో కూడా సందడి లేదు. ప్రేక్షకుల పరిస్థితి రెంటికీ చెడ్డట్లు తయారైంది.
This post was last modified on December 17, 2020 4:47 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…